ముదిగుబ్బ, న్యూస్లైన్ : పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న సెలూన్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్న ఓ వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షలే ఈ హత్యకు దారితీశాయని తెలిసింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు... తిమ్మనాయుని(టీఎన్)పాళ్యంకు చెం దిన టీడీపీ కార్యకర్త బొగ్గు మునయ్య (50) ఏడేళ్లుగా ముదిగుబ్బలో నివాసముంటున్నాడు.
టీఎన్ పాళ్యం సమీపంలోని యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్) ప్రాజెక్టులో చేపలు పట్టే విషయమై ఈయనకు మరొక వర్గానికి తరచూ ఘర్షణలు జరిగేవి. ఇదే విషయమై 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవపడి పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ షాపులో షేవింగ్ చేయిం చుకుంటున్న మునయ్యపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేశారు.
తల, చేయి తదితర భాగాలపై విచక్షణారహితంగా నరకడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన సెలూన్షాపు నిర్వాహకుడు బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ రవీంద్రనాథ్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మునయ్యకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి వరదాపురం సూరి ఆరోపించారు.
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
Published Sun, Oct 13 2013 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement