ప్రధానిది తొందరపాటు నిర్ణయం | Sakshi
Sakshi News home page

ప్రధానిది తొందరపాటు నిర్ణయం

Published Tue, Nov 22 2016 1:17 AM

ప్రధానిది తొందరపాటు నిర్ణయం - Sakshi

ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని నిరోధించడానికంటూ ప్రధాని అకస్మాత్తుగా విసిరిన బాణం దిశ మారి పేదలను తీవ్రంగా తాకింది’అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

బురక్రథకుని వేషధారణలో తిరుపతి వీధుల్లోకి వచ్చిన ఎంపీ.. సోమవారం ఉదయం తిలక్‌రోడ్డులోని ఘంటసాల సర్కిల్‌లో మోదీ నిర్ణయంపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుర్రకథ రూపంలో ఆయన ప్రజలకు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement