ఎస్వీయూ ప్రీ పీహెచ్డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ జోక్యం
రెక్టార్ అనుమతి లేకుండా తుది జాబితా
అర్హతలేని వారిని అందలం ఎక్కించేందుకే..
సంతకం చేసేందుకు నిరాకరించిన రెక్టార్
రాజకీయ ఒత్తిడితో ఎట్టకేలకు పట్టువిడుపు
రిజిస్ట్రార్ తీరుపై వ ర్సిటీ వర్గాల మండిపాటు
తిరుపతి తుడా: ఎస్వీయూలో ఓ ఉన్నతాధికారి పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీ పీహెచ్డీలో అర్హత లేని వారికి అందలం ఎక్కించేందుకు ఫలితాల్లో గోల్మాల్ చేసి ఏకపక్షంగా విడుదల చేశారు. రెక్టార్ అనుమతి లేకుండా ఫలితాలు విడుదల చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. వర్సిటీలో రెక్టార్ ఆమోదం లేనిదే ఎలాంటి ఫలితాలు వెలువడవు. రెక్టార్కు ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం సంతకం లేకుండా లేకుండా రిజిస్ట్రార్ మేడసాని దేవరాజులు ప్రీ పీహెచ్డీ ఫలితాలు వెలువరించారనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం కిందట వర్సిటీ ప్రీ పీహెచ్డీ ఫలితాలను ప్రకటించారు. రెక్టార్ను పక్కన పెట్టి ఫలితాలు విడుదల చేశారని తెలియడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెక్టార్ సంతకం లేకుండా, కనీసం ఆయన అనుమతి కూడా పొందకుండా ప్రీ పీహెచ్డీ ఫలితాలను విడుదల చేయడం వర్సిటీ చరిత్రలో ఇదే మొదటిసారి .
ఫలితాలపై అనుమానాలు
ప్రీ పీహెచ్డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజులు జోక్యం చేసుకోవడంతో రెక్టార్ ఆచార్య జయశంకర్ ఫలితాల విడుదలకు నిరాకరించారని తెలుస్తోంది. అర్హతలేని వారికి పట్టం కట్టేందుకే రిజిస్ట్రార్ ఫలితాలను తన వద్దకు తెప్పించుకుని తుది జాబితా తయారు చేశారని సమాచారం. తయారు చేసిన ఫలితాలపై రెక్టార్ సంతకం పెట్టేం దుకు నిరాకరించారని తెలుస్తోంది. రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా ఫలితాలను విడుదల చేసినట్టు సమాచారం. ఫలితాలు విడుదల చేశాక రెక్టార్ సంతకం లేదని, ఫలితాలు చెల్లే పరిస్థితి లేదని ఎగ్జామినేషన్కు చెందిన మరో అధికారి చెప్పడంతో తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు. సంతకం చేయాలని రెక్టార్పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఎంతకీ సంతకం చేయకపోవడంతో ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా సోమవారం సంతకం పెట్టించారని సమాచారం. రిజిస్ట్రార్ తీరుపై వర్సిటీ వర్గాలు మండి పడుతున్నాయి. తన వారు, సిఫార్సులు తీసుకొచ్చిన వారిని అందలం ఎక్కించేందుకే ఇలా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు పదవి రావడానికి సహకరించిన వారికి కృత జ్ఞతగా ఇలా వ్యవహరించారని వర్సిటీ వర్గాల సమాచారం.
వీసీకి తలనొప్పి ..
రిజిస్ట్రార్ దేవరాజులుకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వర్సిటీలో ఆయన చెప్పిందే వేదంగా మారింది. ప్రీ పీహెచ్డీ ఫలితాల విడుదలలో రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా వ్యవహరించినా వీసీ ఏమీ చేయలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి ఫలితాల్లో అందలం ఎక్కించారని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చెప్పింది వినకుంటే రాజకీయ ఒత్తిళ్లతో తన పంతం నెగ్గేలా రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అందరితో చర్చించే విడుదల చేశా..
వీసీ, రెక్టార్లతో చర్చించే ప్రీ పీహెచ్డీ ఫలితాలను విడుదల చేశా. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో తొందరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నాను. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారు. ఫలితాల్లో రెక్టార్ సంతకం ఉంది.
-ఆచార్య మేడసాని దేవరాజులు,
రిజిస్ట్రార్, ఎస్వీయూ
దేవ దేవా..
Published Sat, Jan 31 2015 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement