వైఎస్సార్ సీపీ స్టూడెంట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలోవిద్యార్థి సంఘాలు
కడప రూరల్ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు నేతలు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని, కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి, నేడు మాట మార్చడం తగదని హితవు పలికారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఈనెల 26వ తేదిన చేపట్టనున్న నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు బాసటగా నిలిచి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకుల కుటిల ఆలోచనలను, నిర్ణయాలను తిప్పి కొట్టడానికి విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా, కరువు ప్రాంతమైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ మాట్లాడుతూ విభజన హామీలను పాలకులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి భవిష్యత్తే ఉండదన్నారు. హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు ప్రత్యేక హోదాకోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దస్తగిరి, నిత్య పూజయ్య, నాగార్జునరెడ్డి, అలీ, సనావుల్లా, సుభాన్ పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
Published Mon, Sep 21 2015 4:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement