నెల్లూరు (రవాణా): రెండో పంటకు సాగునీరు అందించలేమని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ఇప్పటికే నీటిమట్టం తక్కువుగా ఉందని, మొదటి పంటకు ఈ నెలాఖరు వరకు నీరు అందించాల్సి ఉందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణకు వివరించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇరిగేషన్, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో సాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగునీటిపై వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని ఆదేశించారు. సోమశిలలో గతేడాది ఈసీజన్లో 40.43 టీఎంసీల నీరుందని, ప్రస్తుతం 19.52 టీఎంసీలే ఉందని అధికారులు తెలిపారు. కనిగిరి ట్యాంకు కింద 10వ జోన్కింద తప్పనిసరిగా నీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
10జోన్ కింద 3వేల ఎకరాలు సాగులో ఉందన్నారు. వీటికి సంబంధించి 0.2 టీఎంసీ నీరు అవసరముందని వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు రెండో పంట ఉంటుందని, సాగునీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని మంత్రి నారాయణకు ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్పారు. సోమశిలలో 20 టీంఎసీలు నీరున్నా రెండో పంటకు ఇవ్వలేమన్నారు. కావలి కెనాల్ పరిస్థితి ఏమిటని మంత్రి నారాయణ అధికారులును ప్రశ్నించారు.
కావలి కెనాల్ కింది మొత్తం 60,750 ఎకరాలు ఉందని, అందులో 30,750 అధికారికంగా మిగిలినది అనధికారంగా సాగువుతుందని వివరించారు. కాలువ కెనాల్కు మొత్తం 6.13 టీఎంసీ నీరు అందించాల్సి ఉందని, ఇప్పటివరకు 4.6 టీఎంసీలే ఇచ్చామని, మిగిలినది ఈనెల 15లోపు అందిస్తామని చెప్పారు. జేసీ ఇంతియాజ్, సోమశిల ఎస్ఈ సుబ్బారావు, ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
10 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తాం..
జిల్లాలో 2019 నాటికి 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందు కు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సమావేశ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 8 లక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు. ఏడాదికి 50 వేలు చొప్పును 4 ఏళ్లల్లో 2 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాను బెస్ట్ అగ్రికల్చర్, బెస్ట్ హార్టికల్చర్గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం దొంతాలి, కంటేపల్లి, ఇడిమేపల్లి ప్రాంతాల్లోని కాలువలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. వారంలో వాటర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
రెండో పంటకు నీరివ్వలేం
Published Tue, Mar 3 2015 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement