వేములవాడ, న్యూస్లైన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో చేపడుతున్న ఫ్లోరింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అనేక అవాంతరాల మధ్య నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా.. గత నెల 8వ తేదీకే గడువు ముగిసింది. ఇప్పటివరకు యాభై శాతం పనులు పూర్తి కాగా, ఇంకా యాభై శాతం పనులు చేపట్టాల్సి ఉంది. జరిగిన పనులకు వెంటవెంటనే బిల్లు లు చెల్లించిన అధికారులు.. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
దీంతో అధికారుల తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేసేందుకు, కోడె మొ క్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా డ్రెస్స్డ్ గ్రానైట్తో ఫ్లోరింగ్ నిర్మించాలని గత సంవత్సరం పాలకమండలి నిర్ణయించింది. ఆలయ ఆవరణలో 12వేల చదరపు అడుగుల్లో ఫ్లోరింగ్ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి లభించిం ది. రూ.40 లక్షల వ్యయంతో 2012 నవంబర్ చివరివారంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో అధికారులు జాప్యం చేశారు.
తర్వాత మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం ఆషాఢమాసం రావడంతో భక్తులరద్దీ కొంత తగ్గిపోయింది. జూలై 8న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కొంతభాగంలో తవ్వి వదిలేశాడు. అప్పటివరకు ఉన్న రాయిని తొలగించడం కష్టంగా ఉందని సాకులు చెప్పాడు. పాలకమండలి కలగజేసుకుని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మొట్టికాయలు వేయడంతో పనుల్లో కాస్త కదలిక వచ్చింది. తర్వాత కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరగడంతో మళ్లీ పనులను నిలిపివేశాడు. ఈ నెల 8వ తేదీతో కాంట్రాక్టర్తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగిసిపోయింది. ఇప్పటివరకు 12వేల చదరపు అడుగుల పనులకు 7వేల చదరపు అడుగుల పనులు పూర్తయ్యాయి. వీటికి అధికారులు రూ.14 లక్షలు చెల్లించారు.
జరిగిన పనికి బిల్లులు చేతికందడంతో కాంట్రాక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకున్న కాంట్రాక్టర్ మరింత గడువు కావాలని అధికారులను కోరారు. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్ధిష్ట కాలపరిమితిలో పనులు పూర్తికావడం లేదని తెలిసినా.. కాంట్రాక్టర్కు వెంటవెంటనే బిల్లులు చెల్లించడం గమనార్హం.
రానున్నది ‘సమ్మక్క’ సీజన్..
ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతర జరగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రతిసారి జాతర సమయంలో లక్షలాది మంది వేములవాడకు వస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజునుంచి రద్దీ మొదలై నెలరోజులకు పైగా కొనసాగుతుంది. అంటే మరో 45 రోజుల తర్వాత రాజన్న ఆలయంలో కాలుమోపేంత అవకాశం కూడా ఉండదు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆలయ ఆవరణలో పనులు పూర్తి చేయాలన్న ధ్యాస అధికారులకు కలగడం లేదు. తీరా భక్తుల రద్దీ మొదలయ్యాక పనులు ప్రారంభిస్తే.. మళ్లీ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంట్రాక్టర్కు గడువు పొడిగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చేదెన్నడో.. పనులు పూర్తయ్యేదెన్నడో వేచిచూడాల్సిందే.
మందగమనం
Published Fri, Dec 13 2013 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement