జమ్మలమడుగు: ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది సర్కారు అయ్యవార్ల పరిస్థితి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు తమపై వరాల జల్లు కురిపిస్తాడని కొండంత ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)పేరుతో సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అప్పుడే రంగం సిద్ధం చేసింది. పర్యవసానంగా జిల్లాలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనుంది.
హేతుబద్ధీకరణ పేరుతో...
ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేస్తూ ఉంటుంది. అంటే విద్యాహక్కు చట్ట ప్రకారంవిద్యారి,్థ ఉపాధ్యాయ నిష్పత్తిని సరిచూసి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం లేదా పెంచడం చేస్తారు. మన రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్ఫత్తి 1:30గా కొనసాగుతోంది.
ప్రాథమిక పాఠశాలల్లో ఒకటినుంచి 10వరకు విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో ఒక విద్యావాలంటీర్ను, 11నుంచి20వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, 21నుంచి 60 మధ్య విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను, 61నుంచి90 మధ్య ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను, 91నుంచి120 మధ్య ఉంటే నలుగురు ఉపాధ్యాయులను, 121నుంచి150 మధ్య ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులను, అంతకు మించితే 5 గురు ఉపాధ్యాయులతోపాటు అదనంగా ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తున్నారు.
విద్యార్ధుల సంఖ్య పెరగడంలేదా తగ్గడం జరిగే చోట అదనపు ఉపాధ్యాయులను నియమించడం లేదా ఉన్న ఉపాధ్యాయులను వేరే చోటికి పంపించడం చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నిబంధనలను కాస్త మార్పుచేసి కొత్త నిబంధనలను అమలు చేసేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది.
దిగజారనున్న విద్యాప్రమాణాలు...
ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటున్నారు. ఇక కార్పొరేట్ పాఠశాలల్లో అయితే ప్రాథమిక తరగతులకు సైతం సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నారు. అందుకు దీటుగా సర్కారు బళ్లలో కూడా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాప్రమాణాలను మరింత దిగజార్చేలా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తూ...
ఓవైపు ఇప్పటి వ రకు ఉన్న 1:30 నిష్పత్తిని అమలు చేస్తున్నామని చెబుతూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపన్నాగమే పన్నింది. 11నుంచి 20 మధ్య ఉన్న పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న నిబంధనను 11-30గా మార్పు చేయాలని నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు 21-30 విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇకనుంచి అక్కడ ఒకే ఉపాధ్యాయుడు 5తరగతులు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మండలానికి 20నుంచి 30మంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ నిష్పత్తి ప్రకారం దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు తమ పాఠశాలలను విడిచి పెట్టాల్సి వస్తుంది.
‘అయ్య’ బాబోయ్!
Published Wed, Jun 25 2014 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement