ఖమ్మం అర్బన్, న్యూస్లైన్: సాగర్ మేజర్ కాల్వ కట్టలపై గుడిసెల తొలగింపు ప్రక్రియ మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ఉదయం అర్బన్ పోలీస్స్టేషన్లో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశా రు. ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా వెళ్లిన అధికారు లు జేసీబీల సహాయంతో గుడిసెలు తొల గించారు. తొలుత ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు ఉదయం 11 గంటల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. మధురానగర్, సంభానినగర్, గొల్లగూడెంరోడ్డు తదితర పరిసరాల్లో కొన్ని గుడిసెలతో పాటు కట్టడాలను కూల్చారు. మరోపక్క కోర్టు స్టే తెచ్చుకున్న భవనాలను మాత్రం అధికారులు కూల్చకుండా వెనుదిరిగారు.
ఎక్కడా లెక్కలు తప్పవద్దు..? : కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
కూల్చివేతల విషయంలో అధికారులు ఎక్కడా లెక్కలు తప్పవద్దని, తేడా జరిగిన తర్వాత వివాదంలో ఇరుక్కుంటే సహించేది లేదని అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం విధుల్లో పాల్గొనే తహశీల్దార్తో పాటు సర్వే బృందంలోని సిబ్బందిని ఈ విషయంపై హెచ్చరించినట్లు తెలిసింది. ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని, చిన్నా, పెద్ద తేడా లేకుండా కాల్వ భూమిలో ఉన్న వరకు ఖచ్చితంగా గుర్తులు పెట్టి తొలగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ పనులపై వచ్చే ఆరోపణలు ఎప్పటికప్పుడు రహస్యంగా తెలుసుకునేందుకు కలెక్టర్తో పాటు ఎస్పీ ఆరా తీసినట్లు తెలిసింది.
బాధితుల ఆందోళన...
అధికారులు ఆఘమేఘాల మీద తొలగింపులు చేపట్టారని, కొలతలు సక్రమంగా లేకుండా సర్వే అధికారులు ఇష్టం వచ్చినట్లు గుర్తులు పెట్టి కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలు దారపోసి పట్టా భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, వాటిల్లో లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్లు నిర్మించామని, కానీ కాల్వ భూములతో పాటు తమ ప్లాట్లలోని ఇళ్లను కూల్చివేసి రోడ్లపాటు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పైసా పైసా కూడ గట్టుకుని సొంత ఇంటి కల తీర్చుకుంటే ఇలా నిలువునా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన వారిలో చిరుద్యోగులతో పాటు పోలీసు, రెవెన్యూ ఉద్యోగులు సైతం ఉన్నారు. కొంత మంది నాయకులు అసలు కాల్వ స్థలాన్ని వదిలేసి మరోవైపు తప్పి తమ ఇళ్ల మీదకు తీసుకువచ్చారని అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడో రోజూ గుడిసెల కూల్చివేత
Published Sat, Jan 25 2014 5:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement