విజయపురి సౌత్
నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి దగ్గర పడుతుండటం ఆయకట్టు రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వర్షాలు సరిగా పడకపోవటంతో ఇప్పటికే ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాగర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో ఖరీఫ్ పంటలకు నీరందే అవకాశం కనిపించటం లేదు. గతేడాది సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో గేట్లను ఎత్తేశారు. దీంతో రెండు పంటలూ పండి రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
ఎగువ జలాశయూలదీ అదే పరిస్థితి..
కృష్ణా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని జలాశయాలకు ఇన్ఫ్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి 125 టీఎంసీల నీరు చేరితేనే కర్ణాటక ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేస్తుంది. మహారాష్ట్రలోని తుంగభద్ర జలాశయం పరిస్థితి అలానే ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల్లోకి సుమారు 225 టీఎంసీల నీరు వస్తే శ్రీశైలం జలాశయానికి నీటిప్రవాహం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కూడా డెడ్స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 834.20 అడుగులు కాగా కేవలం 54.1501 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయ పూర్తి సామర్ధ్యం 215.8 టీఎంసీలు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రత్యేక అవసరాలకు మినహాయిస్తే నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువకు వెళ్లడానికి లేదు.
సాగర్ పరిస్థితి ఇదీ..
నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు. అంటే 131.6690 టీఎంసీలు. కాగా ఆదివారానికి నీటిమట్టం 514 అడుగుల వద్ద ఉంది. ఇది 138.5610 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 469, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 6,004 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం ఔట్ఫ్లో 6,473 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి చుక్కనీరు కూడా రావటంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగర్ నుంచి 8 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 3వ తేదీ వరకు కృష్ణా డెల్టాకు నాలుగున్నర టీఎంసీల నీటిని విడుదల చేశారు. మరో రెండున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ఇక జంట నగరాల తాగునీటి అవసరాలకు జూలై, ఆగ స్ట్ నెలల్లోరెండు టీఎంసీలు అవసరమవుతాయి. అలాగే కుడి, ఎడమ కాలువల ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడకపోతే గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.
అడుగంటుతున్న ‘సాగర్’
Published Sun, Jul 6 2014 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement