అలంపూర్/వనపర్తి/మహబూబ్నగర్ అర్బన్, న్యూస్లైన్: సురక్షిత ప్రయాణాలకు నిదర్శనంగా నిలిచే బస్సులు మృ త్యువు శకటాలుగా మారుతున్నాయి. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి బస్సులను ఆశ్రయించేవారు మృత్యుబారిన పడుతున్నారు. అందుకు నిదర్శనమే జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద జరిగిన దుర్ఘటన. జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సులో బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న 45 మంది ప్రయాణికులు అగ్నికిఆహుతయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఇతరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ఎందరో ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా పుల్లూరు నుంచి కొత్తూరు మండలం తిమ్మాపూర్ వరకు సుమారు 160 కి.మీ విస్తరించి ఉన్న 44వ జాతీయ రహదారి వందలాది మంది ప్రయాణికులను హరించివేస్తోంది. అలాగే అలంపూర్ నియోజకవర్గంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సులు అధికసంఖ్యలో బయలుదేరుతాయి. హైవేపై అలంపూర్ చౌరస్తా, కోదండాపూర్ స్టేజీ, ఎర్రవెల్లి చౌరస్తా, పెబ్బేర్, కొత్తకోట బైపాస్రోడ్లు, అడ్డాకుల మండలం కనిమెట్ట, వెల్టూర్, కొమ్మిరెడ్డిపల్లి, మూసాపేట, జానంపేట గ్రామాల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతాయని ఎన్హెచ్, పోలీస్ అధికారులు గుర్తించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
కృష్ణానదిలోకి దూసుకెళ్లిన బస్సు
కడప జిల్లా రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు(ఏపీ9 జెడ్ 5212)1993 అక్టోబర్లో ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బ స్సులో ఉన్న 36 మంది జలసమాధి అయ్యారు. అదేవిధంగా ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఇదే కృష్ణానదిలో 1994లో పడింది. ఈ ప్రమాదంలో 42 మందిని మృత్యువు కబళించింది. అదేవిధంగా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులో 2002లో ఆర్టీసీ బస్సుకు నిప్పంటుకుని బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది సజీవ దహనమయ్యారు.
ఈ ప్రమాదంలో అనేక మంది గాయలతో ప్రాణాలు దక్కించుకున్నారు. 2010 డిసెంబర్లో గద్వాలకు చెందిన ఓ కుటుంబం తమ కొడుకుకు వైద్యచికిత్సల కోసం సుమోలో కర్నూలుకు వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపునకు వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 2011లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న మినీ బస్సు కోదండాపూర్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గల పీజీపీకాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం చెందారు. 2012లో మిడ్జిల్ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం తిరుపతి దైవదర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా కోదండాపూర్ బస్టాపులో ఆగిఉన్న లారీని ఢీకొని నలుగురు మృతిచెందారు.
74 మందిపైకి దూసుకెళ్లిన లారీ
ప్రస్తుతం కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద బస్సుదగ్ధమైన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే 1971లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 74 మంది మృత్యువాతపడ్డారు. గ్రామంలోని ఆ గ్రామపటేల్ ఇంటి ఆవరణలో వీధినాటికను చూస్తున్న వారిపైకి వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 74 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పట్లో దీన్ని దేశంలోనే అతి దురదృష్టకరమైన సంఘటనగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 40ఏళ్ల తరువాత అలాంటి దుర్ఘటనే జరగడం పాలెం వాసులను తీవ్రంగా కలిచివేసింది.
అదే ఘోరం.. తీరని శోకం
Published Thu, Oct 31 2013 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement