కడపలో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

కడపలో భారీ చోరీ

Published Fri, Jun 12 2015 4:59 PM

theft in ysr district

కడప: కడప పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పట్టపగలే ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలో లక్ష్మీ టవర్స్‌లో ఫ్లాట్ నెంబర్ 501లో న్యాయవాది హైమావతి కుటుంబం ఉంటోంది. హైమావతి భర్త కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఎవరి పనులకు వారు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితులు పేర్కొంటున్నారు. పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement