కర్నూలు(అగ్రికల్చర్) : వరుణదేవుడితోపాటు బ్యాంకర్లు కూడా అన్నదాతపై కరుణ చూపడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెలా పక్షం రోజులైనా కొత్త రుణాల పంపిణీ ప్రారంభంకాలేదు. వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందని రైతులను గుర్తించి వారిని జాబితాలను బ్యాంకర్లకు పంపారు. కానీ ఇంతవరకు ఒక్క బ్యాంకు కూడా ఈ జాబితాల్లోని వారికి రు ణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులకు ప్రైవేటుగా అప్పులు దొరకడం కష్టమైంది. బంగారం నగలు తాకట్టు పెడితేనే ప్రైవేటు వ్యక్తులు రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షలమంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలకు దూరంగా ఉంటున్నారు.
వీరిలో 50శాతం మంది పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినవారున్నారు. కానీ ప ట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో సిండికేట్ బ్యాం కు లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. పంట రుణాల పంపిణీలో ఎస్బీఐకే లక్ష్యం ఎక్కువగా ఉంది. అయినా ఇవి పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించ గా.. 4.20 లక్షల మందికి ఉపశమనం లభించింది. రుణమాఫీ పొందిన రైతులకు సంబంధించిన పంట రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యువల్ చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో రూ.2385.10 కోట్లు పంట రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.750 కోట్లు పంట రుణాలు రెన్యూవల్ చేశారు.
కౌలు రైతుల గోడు వినేది ఎవరు...!
జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అర్హులైన కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా వాటితో ప్రయోజనం లేకుండా పోయింది. ఈఏడాది జిల్లాలో 20 వేల మంది కౌలుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశారు. ఒక్క కౌలుదారునికి కూడా రుణం ఇవ్వలేదు. ‘ పట్టాభూములు కల్గిన రైతులకే రుణాలు ఇవ్వడం కష్టం అయింది. ఇక కౌలుదారులకు రుణాలు ఎలా ఇస్తారండీ...’ అంటూ ఓ బ్యాంకు అధికారి చెప్పడం గమనార్హం. కౌలు రైతులకు ప్రైవేటు అప్పులు పుట్టడం లేదు..బ్యాంకులూ మొండిచేయి చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకెవరు దిక్కంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణాలు ఇవ్వడం లేదు
నాకు కౌలు రుణ అర్హత కార్డు ఇచ్చారు. దానిని బ్యాంకులో చూపిస్తే..రుణం ఇవ్వడానికి అది పనికి రాదన్నారు. బయటన్నా అప్పు తీసుకుందామంటే వడ్డీలు చూసి భయమేస్తోంది. ఎవరి చేయూతా లేకుండా వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలి.
- తెలుగు చంద్ర, కౌలు రైతు, పెండేకల్లు
కొత్త రుణాల్లేవ్!
Published Thu, Jul 16 2015 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement