సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర వృద్ధిరేటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావంలేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు పెరుగుతోందన్నారు. గతేడాదిలో ఆరు నెలల కాలానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 10.71 శాతంగా ఉంటే అది ఈ ఏడాది 11.73గా నమోదయ్యిందన్నారు. గురువారం విజయవాడలో వాణిజ్య శాఖ్య పన్నుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా యనమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఒక్క రియల్ ఎస్టేట్ రంగంపై మాత్రమే ప్రతికూల ప్రభావం చూపిందని, దీంతో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు.
ఈ ఏడాది వాణిజ్య శాఖకు రూ. 40,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తే మొదటి ఆరు నెలల్లో ఇందులో 44 శాతం చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతోందన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోలేనే రూ. 30,000 కోట్ల వరకు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెట్రోల్పై అదనంగా పెంచిన రూ. 4 వ్యాట్ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యనమల స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో బంకులు మూత పడుతుండటంతో అదనపు వ్యాట్ను రూ. 2 వరకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంపై జీఎస్టీ ప్రతికూల ప్రభావం లేదు
Published Fri, Oct 13 2017 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement