జగిత్యాల జోన్, న్యూస్లైన్: జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తల కొరత ఏర్పడింది. ఇక్కడ 36 మంది శాస్త్రవేత్తలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పది మందే పనిచేస్తున్నారు.
మిగతా పోస్టులు నెలల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్నవారికే అదనపు బాధ్యతలు నెత్తికెత్తుతున్నారు. వీరికి బోధన, పరిశోధన విధులు అప్పగించడంతో ఏ పనీ సక్రమంగా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా నూతన ఆవిష్కరణలతో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన పరిశోధన స్థానం పనితీరు అధ్వానంగా మారింది. ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోని పన్నెండు వ్యవసాయ పరిశోధన స్థానాలకు పొలాస పరిశోధన స్థానంగా కేంద్ర స్థానంగా ఉండేది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటల సరళి, సాగునీటి యాజమాన్యం, చీడపీడల సమస్యలపై పరిశోధనలు చేసేందుకు ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దాదాపు 154 ఎకరాల్లో పరిశోధన స్థానం ఏర్పాటయింది. 1983 నుంచి వివిధ పంటలపై పరిశోధనలు చేయడం ప్రారంభించింది. వరి, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటల్లో పరిశోధనలు చేసి, ఎన్నో నూతన రకాలను రూపొందించి ఖ్యాతి గడించింది. ప్రస్తుతం పొలాస పరిశోధన స్థానం సేవలను కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకే పరిమితం చేశారు. ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలకు మార్గదర్శకంగా పనిచేస్తోంది.
పొలాస పరిశోధన స్థానంలో తొమ్మిది విభాగాలకు కలిపి దాదాపు 36 మంది శాస్త్రవేత్తలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పట్టుమని పదిమంది కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. రెండు, మూడు విభాగాలకైతే కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలే లేకపోవడంతో పరిశోధనలు పడకేశాయి. ఇక్కడికి బదిలీపై వచ్చినవారు రాజకీయ నాయకులు, యూనివర్సిటీ ఉన్నతాధికారుల పైరవీలతో వెంటనే వెనక్కు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఓ శాస్త్రవేత్తను హైదరాబాద్ నుంచి పొలాసకు బదిలీ చేయగా.. ఇక్కడ జాయిన్ కాకుండానే పైరవీలు చేసి రాజధానిలోనే తిష్టివేశారు.
మరో శాస్త్రవేత్తకు ఐదారుసార్లు బదిలీ ఆర్డర్లు వచ్చాయంటే యూనివర్సిటీలో లాబీయింగ్ ఎలా జరుగుతోందో ఊహించవచ్చు. మరికొందరు శాస్త్రవేత్తలు పీహెచ్డీ, పిల్లల చదువు పేర వచ్చిన పది నెలల లోపే రాజధానికి బదిలీ చేయించుకుంటున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం మరో నలుగురు శాస్త్రవేత్తలు పీహెచ్డీ, మెటర్నిటీ, బదిలీ పేరిట ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీనికితోడు పొలాసలో పనిచేసే శాస్త్రవేత్తలకు హెచ్ఆర్ఏ 10 శాతం ఇస్తుండగా, హైదరాబాద్లో 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారు.
పొలాసలో పనిచేస్తామన్న శాస్త్రవేత్తలకు ఒక్కొక్కరికి నాలుగైదు విభాగాలను అప్పగించడంతో పనిభారం పెరిగి వీరు సైతం రాజధానికి వెళ్దామని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలదన్నట్టు పరిశోధన స్థానానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉండడంతో, వ్యవసాయ శాస్త్రవేత్తలనే అక్కడ పాఠాలు చెప్పేందుకు వినియోగిస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలకు మరింత పనిభారం పెరిగింది. ఈ విషయమై పరిశోధన స్థానం డెరైక్టర్ ఎల్.కిషన్రెడ్డి స్పందిస్తూ.. శాస్త్రవేత్తల కొరతపై యూనివర్సిటీ ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. శాస్త్రవేత్తల కొరత కారణంగా ఉన్న వారికే అదనపు బాధ్యతలను అప్పగించకతప్పలేదన్నారు.
శాస్త్రవేత్తలు ఖాళీ
Published Mon, Sep 16 2013 4:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement