సాక్షి, అనంతపురం : చౌకధాన్యపు డిపో డీలర్లు సమైక్య ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సమ్మెలో ఉన్న సమయంలో ఇక తమను అడిగే వారే లేరనే ధైర్యంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. తెల్ల రేషన్కార్డుదారులకు మంజూరైన కిలో రూపాయి బియ్యాన్ని కనీసం డిపో వరకు కూడా తీసుకెళ్లకుండా.. గోదాము నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలించేశారు.
అమ్మహస్తం పథకం కింద పంపిణీ అయ్యే తొమ్మిది రకాల సరుకులనూ ఇదే బాట పట్టించారు. కార్డుదారులు మాత్రం సమైక్య ఉద్యమం కారణంగా సరుకులు రాలేదన్న భావనలో ఉండిపోయారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కువ ధర పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే డీలర్లు ఎక్కువగా అక్రమాలకు పాల్పడ్డారు.ఇలాంటి వారిపై ప్రస్తుతం ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో 2,862 చౌక ధాన్యపు డిపోలు నడుస్తున్నాయి. సమ్మె కాలంలోనూ నిత్యావసర సరుకులను సరఫరా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీలర్ల అసలు రంగు బయటపడింది. తమకు అందాల్సిన సరుకులను డీలర్లు బొక్కేశారని తెలుసుకున్న కార్డుదారులు... ఆర్డీఓలు, తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటి దాకా దాదాపు పది మందిపై కేసులు నమోదు చేశారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, నల్లమాడ, కూడేరు, ధర్మవరం మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) శాంతకుమారి తెలిపారు. డీలర్లపై 6ఏ, 18ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణకు మండల స్థాయిలో ఎన్ఫోర్స్మెంటు కమిటీలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉండగా... విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్తున్న సమయంలో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం నల్లమాడ మండలం బొగ్గలపల్లిలో విచారణకు వెళ్లిన సివిల్ సప్లయిస్ డిప్యూటీతహ శీల్దార్ కృష్ణమూర్తి ఎదుటే రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. తమపైనే ఫిర్యాదులు చేస్తారా అంటూ డీలర్, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆరుగురు గ్రామస్తులు గాయపడ్డారు. విచారణ అధికారులు కనీసం పోలీసులను కూడా వెంటబెట్టుకోకుండా గ్రామాలకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చిన డీలర్లపైనే విచారణ చేస్తున్నారని, మిగతా వారి అక్రమాల మాటేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.
యథేచ్ఛగా చౌక బియ్యం
Published Wed, Nov 6 2013 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement