ప్రతిఘటించిన మహిళను నిప్పంటించి చంపిన దొంగ | Sakshi
Sakshi News home page

ప్రతిఘటించిన మహిళను నిప్పంటించి చంపిన దొంగ

Published Mon, Jan 20 2014 12:24 PM

thief burns woman alive in prakasham district

ప్రకాశం జిల్లా పొదిలి విశ్వనాథపురంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆ ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న సమస్తం దోచుకోడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె అతడి ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో, ఆ దొంగ.. ఆ మహిళపై కిరోసిన్ పోసి, నిప్పంటించి, ఆమెను హతమార్చాడు.

దొంగతనాలకు వచ్చినప్పుడు వారిని ప్రతిఘటిస్తే హత్యలకు సైతం పాల్పడుతున్న వైనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైన్ స్నాచర్లు కూడా గొలుసులు తెంపుకెళ్లేందుకు ప్రయత్నించడం, వారు గట్టిగా ప్రతిఘటిస్తే ఏకంగా పీకలు కోసేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

Advertisement
Advertisement