రాజంపేట: వైఎస్ఆర్ జిల్లాలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం దత్తత తీసుకోవడం కలగానే మిగులుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చారిత్రాత్మక దేవాలయంగా తెరపైకి వచ్చింది. అయితే కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడంతో ఆలయ నిర్వహణ విషయంలో దేవదాయధర్మాదాయశాఖ కానీ, తిరుమల తిరుపతి దేవస్ధానం కాని పట్టించుకోవడంలేదు.
ఇంతవరకు ట్రస్ట్బోర్డుకు నోచుకోలేదు. కేవలం సింగల్ట్రస్ట్తో నడుస్తోంది. ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును చూసిన భక్తులు అచ్చం ఏడుకొండలస్వామినే దర్శించుకున్నంత భాగ్యం కలుగుతోందని అనుభూతి చెందుతున్నారంటే ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతుంది.
సౌమ్యనాథాలయ చరిత్రలోకి..
సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్ప కళాసంపత్తికి ఆలవాలమై చెయ్యేరు(బహుదా) నదీతీరాన నందలూరు గ్రామంలో నిర్మితమై ఉంది. జిల్లా కేంద్రం కడపకు 45కిలోమీటర్ల దూరంలో, రాజంపేటకు 10కిలోమీటర్ల దూరంలో ఉంది. 10ఎకరాల విస్తీర్ణంలో..108 స్తంభాలతో నిర్మించిన సువిశాలమైన ఆలయం. కులోత్తుంగచోళుడు (చోళరాజు)11శతాబ్ధం పూర్వార్ధంలో ఆలయాన్ని నిర్మించారు. అన్నమయ్య స్వామిని దర్శించుకొని కీర్తనలు ఆలపించారని చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం వెనుక వెయ్యేళ్ల చరిత్ర ఉంది. స్వామి వారి గర్భగుడిలో ఏ దీపంలేకపోయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దివ్యమంగళరూపం దేదీప్యమానంగా కనపడే విధంగా ఆలయం నిర్మించడం విశేషం. స్వామివారి పాదాలపై స్యూరకిరణాలు పడతాయి.
నారదమునీంద్రునిచే ప్రతిష్ట..
శ్రీసౌమ్యనాథస్వామి ఆలయంలో మూలవిరాట్టును దేవర్షియగు నారదమునీంద్రులు ప్రతిష్టించారు. మూలవిరాట్టు ఆరు అడుగులు ఎత్తుతో సౌమ్యంగా అభియముద్రాలంకితమై దర్శనిమిస్తారు. సౌమ్యనాధున్ని చోళరాజులు చొక్కనాధుడు అని పిలుచుకునేవారు. సౌమ్యనాథుడనగా సౌమ్య(లక్ష్మీదేవి)కు నాథుడని, ప్రశాంతస్వరూపుడని అర్ధాలున్నాయి. తెల్లవారుజామున ఆలయంలో సప్తబుషులు స్వామికి పూజచేస్తారని పూర్వం ఆలయ అర్చకులు చూసిన దాఖలాలు ఉన్నాయని ప్రచారం. ఐదేళ్ల కిందట నుంచి ఆలయం దినాదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. స్వామికి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు.
దత్తతకు సిద్ధమై ఆపై....
టీటీడీ పాలకమండలి దేవుని కడపతోపాటు నందలూరు సౌమ్యనాథాలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధమైనా రూ.30లక్షల వ్యయంతో రథం మాత్రం చేయించి సరిపెట్టింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి సైతం టీటీడీ దత్తతు తీసుకునేందుకు సమ్మితించారు. ఆయన మరణం తర్వాత ఈ విషయం ఎవరూ పట్టించుకోవడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంతమండలంలో ఉన్న ఘనచరిత్ర కలిగిన సౌమ్యనాథాలయం టీటీడీలోకి విలీనం చేయడంపై ఆయన దృష్టిపెట్టాలని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథునరెడ్డి కూడా ఈ ఆలయానికి కేంద్రపురావస్తుశాఖ నుంచి విముక్తి కల్పించి, టీటీడీలోకి విలీనం చేసేలా కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు.
సౌమ్యనాథా... దత్తతేదీ!
Published Sat, Feb 28 2015 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement