యజమానినే బురిడీ కొట్టించాలని చూసి.. | Sakshi
Sakshi News home page

యజమానినే బురిడీ కొట్టించాలని చూసి..

Published Thu, Jan 21 2016 6:33 PM

Three arrested in kidnap case

లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్ జిల్లా) :  యజమానిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయరాజు తన ప్రైవేటు బస్సులను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆంజనేయరాజును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.

తనను వదిలేస్తే డబ్బులు తెచ్చి ఇస్తానని కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన రాజు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు అనంతరం రాజు వద్ద డ్రైవర్లుగా పనిచేసినవారే కిడ్నాప్ చేశారని గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement