విశాఖ జిల్లాలో కలకలం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో కలకలం సృష్టించిన ట్రిపుల్ మర్డర్

Published Sun, Nov 3 2013 9:17 PM

విశాఖ జిల్లాలో కలకలం సృష్టించిన ట్రిపుల్ మర్డర్

విశాఖపట్నం:  స‌మాజంలో రోజురోజుకీ మాన‌వ‌త్వం మంట‌క‌లసిపోతోంది. బంధాలు, బంధుత్వాలు రూపుమారిపోతున్నాయి. ఆస్తికోస‌మో.. క‌ట్నం కోస‌మో... కుటుంబ క‌ల‌హాల‌తోనో... విచ‌క్షణ లేకుండా హ‌త్యల‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి ఈ ఘ‌ట‌న‌లు ఏదో ఒక‌చోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా పండుగ పూట విశాఖ జిల్లాలోని చినముషిడివాడలోని కాంతీనగర్‌లో  ట్రిపుల్ మ‌ర్డర్ క‌ల‌క‌లం ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ముగ్గురు దారుణ‌హత్యకు గురైయ్యారు.

 

ప్రాధ‌మిక నివేధిక ప్రకారం.. ఆస్తి త‌గ‌దాల వ‌ల‌నే ఆ ముగ్గురిని అతిదారుణంగా హ‌త‌మార్చినట్టు తెలుస్తోంది. ఓ ఇంట్లో మ‌హిళ‌తో స‌హా మూడు మృత‌దేహాలు గుర్తించిన‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురు మామ‌, అత్త, బావ‌మ‌రిదిని అల్లుడే న‌రికి చంపిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ క‌ల‌హాల‌తోనే అల్లుడు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. నిందితుడు అసిరి నాయుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement