గ్రామాల్లో ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించామని చెప్పినా.. అనేక చోట్ల తెరవెనుక టీడీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. నరసన్నపేట మండలంలోని గోపాలపెంట ర్యాంపు కూడా ఇందుకు మినహాయింపు కాదు!!
నరసన్నపేట : గోపాలపెంటలో ఇసుక ర్యాంపును డ్వాక్రా మహిళలకు అప్పగించినా వారు నామమాత్రంగానే ఉంటున్నారు. అంతా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన మరో వ్యక్తే చూస్తున్నారు. ఆయ న చెప్పిందే వేదం. ఇసుక లోడు కావాలన్నా, ఆగాల న్నా ఆయన చెప్పినట్టే చేయాలి. డీఆర్డీఏ అధికారులు వచ్చినా ఆయనతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఇలా పెత్తనమంతా టీడీపీ నేతదే కాగా, రసీదులు రాయడానికే డ్వాక్రా మహిళలు పరిమితమవుతున్నారు.
అక్రమ లోడులు
ఈ ర్యాంపులో నిత్యం వందలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లారీల్లో అధికంగా ఇసుక లోడ్ చేయాలన్నా, సీరియల్ కాకుండా ముందుగా లోడ్ కావాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందే. మూడు నెలలుగా ఇక్కడ ఇసుక ర్యాంపు నిర్వహిస్తుండగా వారం రోజులుగా వాహనాల తాకిడి అధికంగా ఉంది. జిల్లాలో మరెక్కడా లారీలకు ఇసుక లోడ్ చేయక పోవడంతో గోపాలపెంట ర్యాంపునకు వాహనాలు అధికంగా వస్తున్నాయి. ఇక్కడ 9 క్యూబిక్ మీటర్లు ఇసుకనే ఇస్తున్నారు. దీంతో టిప్పర్లు విశాఖ, విజయనగరం. జిల్లాల నుంచి అధికంగా వస్తున్నాయి. ర్యాంపులో రెండు పొక్లెయిన్లు లోడింగ్కు ఉపయోగిస్తుండగా ఒకటే నిరంతరంగా లోడ్ చేస్తోంది.
మరో పొక్లెయిన్ నిత్యం మొరాయిస్తూ ఉంది. ఒక్కో లారీ మూడు రోజుల వరకూ క్యూలో ఉంటున్నాయి. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ర్యాంపు నిర్వాహకులు లారీల సిబ్బంది నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ర్యాంపులో 1.80 ల క్యూబిక్ మీటర్లు ఇసుక విక్రయించాలని అధికారులు నిర్ణయించగా సోమవారం ర్యాంపు ముగిసే సరికి 62 వేల క్యూబిక్ మీటర్లు ఇసుకను మాత్రమే విక్రయించినట్లు లెక్కలుచెబుతున్నారు. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానేఅమ్మినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ ర్యాంపు పేరిట లారీలు వచ్చి పోతుండటంతో రోడ్డు పాడైందని, రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇళ్లకు చెందిన కుటుంబాలు వాహనాల శబ్దానికి ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను ఉన్నతాధికారులు చక్కదిద్దాలని వారుకోరుతున్నారు.
మూడు లారీలు.. 6 లోడులు
Published Wed, Aug 19 2015 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement