చెన్నై: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ సోమవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో... మృతి చెందారు.
వెంకట రమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో జన్మించిన రమణ...ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. అంచలంచెలుగా ఎదిగిన రమణ...2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది.
తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకట రమణకు మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది.
కాగా వెంకట రమణ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు వెంకట రమణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నారు.
Breadcrumb
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
Published Mon, Dec 15 2014 10:05 AM
Related news
-
US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!
గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 మంది విద్యార్థులు వేర్వేరు పరిస్థితిల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్ తీవ్ర భయాదోళనలు వ్యక్తం చేసింది. నిజానికి మన దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకై అమెరికా వైపుకే మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు ఆ దేశం సురక్షితమేనే అనే సందేహాలు అందరిలోనూ మెదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మరణాలపై దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయులకు సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) చాలా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలు పునారావృత్తం కాకుండా యూఎస్ అధికారులు, విశ్వవిద్యాలయాలు సంస్థలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేగాదు అమెరికాలో ఉండే భద్రతపై పరిజ్ఞానం లేకపోవడం వల్ల పర్యావరణ మరణాలు(మోనాక్సైడ్ విషప్రయోగం, అల్పోష్ణస్థితి), ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరిపించే మానసిక సమస్యలు వల్ల అనుమానాస్పద మరణాలు, హింసాత్మక నేరాలు జరిగినట్లు సర్వేలో వెల్లడించింది. ఆయా కారణాల వల్ల బాధిత విద్యార్థులు మరణాలకు కారణమని ఎఫ్ఐఐడీఎస్ సర్వేలో తేలింది. యూఎస్లో విద్య అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల అని పేర్కొంది. ఈ భయానక ఘటనలు ఒక్కసారిగా భారత సంతతి విద్యార్థులు, వారి కుటంబాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయని వెల్లడించింది. ప్రస్తుతం యూఎస్లో దాదాపుగా రెండు లక్షలకు పైగా భారత సంతతి విద్యార్థులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం విదేశీ విద్యార్థులలలో సుమారు 25% మంది విద్యార్థుల నుంచి ఫీజులు, ఖర్చులు రూపంలో అమెరికా దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తోందని ఎఫ్ఐఐడీఎస్ చీఫ్ ఖండేరావ్ కాండే అన్నారు. ఈ మరణాలు పెరిగినట్లయితే ఆ ఆదాయానికి గండి పడే అకాశాలు ఉండటమే గాక యూఎస్ విశ్వవిద్యాలయాల భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఎఫ్ఐఐడీఎస్ హెచ్చరించింది. అంతేగాదు దీన్నే అదనుగా చూసుకుని కొందరూ అమెరికా సమాజంపై ద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోసి భారతీయ అమెరికా కమ్యూనిటీ చుట్టూ పుకార్లు వ్యాపించేలా చేస్తున్నట్లు ఎఫ్ఐఐడీఎస్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఐడీఎస్ భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆందోళనలు, భద్రతకు సంబంధించిన సర్వేను ప్రారంభించింది. ఆసక్తిగల భారత సంతతి విద్యార్థులు ఈ ఎప్ఐఐడీఎస్ వెబ్సైట్లోని సర్వేలో పాల్గొని తామ ఎదుర్కొంటున్న భయాందోళనలు గురించి వెల్లడించాలని పిలుపునిచ్చింది.అంతేగాదు అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న భద్రత, శ్రేయస్సుకి సంబంధించిన ఆందోళనలు పరిష్కరించేలా యూఎస్ అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరింది ఎఫ్ఐఐడీఎస్ ►సురక్షిత విద్యను పెంపొందించడం: చాలామంది విదేశీ విద్యార్థులుకు తాము ఉన్న నిర్థిష్ట ప్రాంతాల్లో జరిగే నేరాలు, ప్రమాదాల పట్ల అవగాహన ఉండకపోడచ్చు . అందువల్ల విద్యాపరంగా సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో ఉండేలా నిర్ణయాలు తీసుకునేలా సమాచారం అందించడం లేదా శక్తిమంతంగా ఎలా ఎదుర్కొవాలే అవగాహన కల్పించడం వంటివి చేయాలి. ►రెస్క్యూ విధానాలు మెరుగుపరచడం: అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదంలో ఉన్న విద్యార్థుల భద్రత లేదా వారి క్షేమం నిర్థారించేలా తక్షణ ప్రతిస్పందన, సమర్థవంతమైన రెస్క్యూ విధానాలు చాలా ముఖ్యమైనవి. దీని వల్ల అంతర్జాతీయ విద్యార్థుల ప్రమాదాలను నియంత్రించగలుగుతాం. తద్వార విద్యారుల జీవితాలను కాపాడగలం కూడా. ►ర్యాగింగ్కి అడ్డుకట్టవేయడం: ర్యాగింగ్ వంటివి విద్యార్థుల శారీరీక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. అటువంటి వాటికి వ్యతిరేకంగా కఠిన నియమాలు, నిబంధనల అమలు చేయడం వల్ల ఎలాంటి నేర పూరిత సంఘటనలు ఎదురవ్వకుండా నియంత్రించగలుగుతాం. తద్వారా విదేశీ విద్యార్థులకు సమగ్రమైన క్యాంపస్ వాతావరణాన్ని అందించగలుగుతాం. ►ప్రమాదాలు భద్రతపై అవగాహన: విదేశీ విద్యార్థుకు కొత్త ప్రదేశాల్లోని క్యాంపస్ లోపల, వెలుపల ఎదురయ్యే ప్రమాదాలు, నష్టాలు గురించి అవగాహన కల్పించాలి. అక్కడ తమ తోటి విద్యార్థుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి. ►మానసిక ధైర్యం అందిచటం: విదేశీ విద్యార్థులు తమ వాళ్లను దేశాన్ని అన్నింటిని వదిలేసి ఇంత దూరం చాలా ప్రయాస పడి వస్తారు. వారికి ఇక్కడ ముందుగా ఎదరయ్యేది ఒంటిరితనం. ఇది వారిలో కలగుకుండా ఉండేలా మానసిక స్థైర్యాన్ని అందించేలా తోడ్పాటు అందించటం వల్ల కూడా అనుమానస్పద మరణాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. చివరిగా జాతి లేదా మతం ఆధారంగా భారత సంతతి విద్యార్థుల పట్ల ద్వేషపూరిత నేరాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా అనేదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం. సత్వరమే వారికి న్యాయం అందేలా చేయడం. ముఖ్యంగా మైనారిటి వర్గాలపై జరిగిన వివక్ష లేదా హింస గురించి పూర్తి స్థాయిలో విచారించడం ముఖ్యం. ఈ చర్యలన్ని తీసుకుంటే తమ సొంత గడ్డను వదిలి ఎందో ప్రయాస పడి ఇంత దూరం వచ్చిని విదేశీ విద్యార్థులుకు సురక్షితమైన వాతావరణాన్ని, ధైర్యంగా విశ్వవిద్యాలయంలో చేరి మంచి చదువును పొందగలమనే భరోసాను వారికి అందించగలుగుతామని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. (చదవండి: కెనడాలో భారతీయ విద్యార్థి మృతి) -
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ పీటీఐకి తెలిపారు. దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. 5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు మౌ సదర్ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు. -
భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో జీన్స్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo — ANI (@ANI) March 21, 2024
Related News by category
-
ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత: ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, గుంటూరు: ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉందని వ్యాఖ్యలు చేశారు. కాగా, గుంటూరులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కార్యక్రమంలో భాగంగా అధికారులు 3k రన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..‘ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉంది. దేశ భవిష్యత్తే యువత.యువత ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. తుది ఓటర్ జాబితా తయారీ చేయడంలో చాలా ఇబ్బందులుంటాయి. యువత ఎప్పటికప్పుడు మొదటి సారి ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాంము. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. 20 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 68 శాతం కంటే తక్కువగా ఉంటుంది. అర్బన్ నియోజకవర్గాల్లోనే తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది. ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి’ అని కోరారు. -
ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ బీమా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు. -
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్లో 900, ఆర్ట్స్లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం -
కేసులతో చింతమనేని సరికొత్త రికార్డు
ఏలూరు టీడీపీ అభ్యర్థిపై పేకాట, ఫోర్జరీ, చీటింగ్ కేసులు.. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై విదేశీ నగదు మార్పిడి ఘటనలో ఫెమా చట్టం కింద కేసు నమోదు.. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఫైనల్గా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై లెక్కకు మించి రికార్డు స్థాయిలో కేసులు.. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా చింతమనేని సరికొత్త రికార్డు. వీరంతా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి పారీ్టల నుంచి పోటీ చేస్తున్న నేతలు. ఎన్నికల అఫిడవిట్లో ప్రతిఒక్కరూ కేసుల చిట్టాను సమర్పించారు. సాక్షిప్రతినిధి, ఏలూరు: ఏలూరు పార్లమెంట్ నియో జకవర్గంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వివాదరహితులు, సచీ్చలురుగా ఉండాలనదే ప్రజల ఆకాంక్ష. ఇక కూటమి అభ్యర్థులు ఇదే రీతిలో విస్తృతంగా ఆటోలు పెట్టి, ఇంటింటికి తిరిగి మరీ మేం చాలా మంచివాళ్లం.. మాకే ఓటు వేయండి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిఒక్కరూ సమరి్పంచే అఫిడవిట్లో కేసుల చిట్టాను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇవేమీ ప్రభుత్వ కక్ష సాధింపుతో గడిచిన ఐదేళ్లల్లో పెట్టిన కేసులు కూడా కాదు. అన్నీ అంతకుముందే వారి వ్యాపార, క్రిమినల్, స్వభావాల రీత్యా నమోదైన కేసులు. కేసుల్లో చింతమనేని టాప్ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై 93 కేసులు నమోదయ్యాయి. బహుశా రాష్ట్రంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదైన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో అత్యధిక కేసులతో పాటు రౌడీషీట్ ఉన్నఅభ్యర్థిగా చింతమనేని రికార్డుకెక్కారు. మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్పై దాడి కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడింది. అప్పీలుకు వెళ్లి ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొల్లేరులో అటవీ శాఖాధికారులు, ముసునూరులో తహసీల్దార్ వనజాక్షి, దెందులూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డుకున్నారని మైనింగ్ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, సిటీ పోలీసులు, సాధారణ పౌరులు ఇలా లెక్కకు మించి చింతమనేని బాధితులు ఉండటంతో అదే సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులో పుట్టా మహేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా చాపాడు పోలీస్స్టేషన్ పరిధిలో చిన్నగురివిగాల ఎల్లయ్యను కులం పేరుతో దూషించి తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఇది 2014లో జరిగిన ఘటన, 103/2014 నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎల్లయ్యను బెదిరించిన ఆడియో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ మాట్లాడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పేకాట కేసుల్లో బడేటి చంటి ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటి పేకాటలో ప్రముఖ వ్యక్తి. ఏలూరు చుట్టుపక్కల జిల్లాలే కాకుండా విశాఖ వెళ్లి ఆడుతుంటారు. ఈ క్రమంలోనే భీమిలిలో రెండేళ్ల క్రితం పేకాడుతూ పట్టుపడ్డారు. 66/2022 నంబరుతో కేసు నమోదైంది. అలాగే ఏలూరులో సీసీ 254/2022 నంబరుతో ప్రైవేటు కేసు నమోదైంది. ఫోర్జరీ, చీటింగ్ సెక్షన్లు నమోదు చేసిన కేసు కోర్టులో విచారణ కొనసాగుతుంది. విదేశీ నగదు మార్పిడి కేసులో పార్థసారథి మాజీ మంత్రి, నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై మూడు కేసులు ఉన్నాయి. ఘంటసాల, విజయవాడ పోలీస్స్టేషన్లల్లో రెండు చిన్నపాటి కేసులు నమోదయ్యాయి. ఇక విదేశీ నగదు మార్పిడి కేసులో ఫెమా చట్టం కింద కేసు నమోదైంది. అది కూడా 22 ఏళ్ల క్రితం నమోదైన కేసు. హై దరాబాద్లోని స్పెషల్ ఎకానమీ అఫెన్స్ కోర్టులో సీసీ 69/2002, సీసీ 99/2002 నంబర్లతో కేసు నమోదైంది. 69/2002 కేసులో రూ.5 వేలు జరిమానా విధించగా, 99/2002లో రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేలు జైలు శిక్ష విధించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement