మహబూబాబాద్, న్యూస్లైన్ : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందాలి.. ఆ బాధ్యత అధికారులపై ఉం ది.. నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ జి.కిషన్ స్పష్టం చేశారు. పట్టణంలోని బాలాజీ గార్డెన్లో బుధవారం మహబూబాబాద్, నర్సంపేట డివిజన్లకు సంబంధించి అన్ని శాఖ ల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పథకాల అమలుపై చర్చించి అధికారులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అభ్యుదయ అధికారులను కేటాయించామని, వారు ప్రతి శుక్రవా రం కేటాయించిన గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల కు తెలియజేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేయగానే స్వీకరించి పరిష్కా రం మార్గం చూపినపుడే అభ్యుదయ అధికారులపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు. గ్రా మంలోని సమస్యలు తెలుసుకోవడానికి సర్పంచ్లకు ప్రభుత్వం ఉచితంగా సిమ్కార్డులను అందిస్తోందని, ఆ ప్రక్రియ వారంలో పూర్తవుతుందని చెప్పారు.
ప్రతి గ్రామంలో పింఛన్లు, రేషన్కార్డులు ఇతరాత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన జాబితాను పంచాయతీ కార్యాలయంలో అంటించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శిపైనే ఉందన్నారు. మహిళా సాధికారత, ఓటరు నమోదు కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పర్చడంతోపాటు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు అందించేలా చూడాలని చెప్పారు. ప్రతి నెలా రెండో శనివారం గ్రామ సమస్యల ను సర్పంచ్ల ద్వారా తెలుసుకోవడానికి తాను అందుబాటులో ఉంటానని కలెక్టర్ తెలిపారు.
అధికారులకు క్విజ్ పోటీ
సమీక్ష సమావేశంలోనే వివిధ అంశాలపై అధికారులకు క్విజ్ పోటీ నిర్వహించారు. సరైన సమాధానం చెప్పినవారికి బహుమతులు అందజేశారు. అధికారులు సైతం ఆసక్తిగా పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజేఏసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్గోపాల్, డ్వామా పీడీ హైమావ తి, మానుకోట, నర్సంపేట డివిజన్ల ఆర్డీఓలు మధుసూదన్నాయక్, అరుణకుమారి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
Published Thu, Jan 16 2014 4:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement