ప్రత్యేకహోదాపై వాయిదా తీర్మానానికి నోటీసులు | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదాపై వాయిదా తీర్మానానికి నోటీసులు

Published Tue, Dec 6 2016 1:57 AM

To the notice for an adjournment motion on the special status

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిన రోజున రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం ఇప్పటివరకు హోదా ప్రకటించలేదని, ఈ అంశంపై చర్చకు వీలుగా సభా కార్యక్రమాలను వాయిదావేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు.

అయితే ఈ అంశం ముఖ్యమైనదైనా సభాకార్యకలాపాలను వాయిదా వేయాల్సిన పనిలేదని, సరైన ఇతర నిబంధనల కింద చర్చించుకోవచ్చని పేర్కొంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నోటీసులను తిరస్కరించారు.

Advertisement
Advertisement