నెల్లూరు జడ్పీచైర్మన్ ఎన్నిక యథాతథం : కలెక్టర్ శ్రీకాంత్ | Sakshi
Sakshi News home page

నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక యథాతథం : కలెక్టర్ శ్రీకాంత్

Published Sun, Jul 20 2014 11:33 AM

నెల్లూరు జడ్పీచైర్మన్ ఎన్నిక యథాతథం : కలెక్టర్ శ్రీకాంత్ - Sakshi

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు  ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నిక నిలపమని తమకు ఎటువంటి ఆదేశాలు లేవన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపినట్లు ఆయన చెప్పారు.

 కలెక్టర్ జడ్పీ హాలుకు చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కలెక్టర్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. వైఎస్ఆర్ సిపి ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి,  ఎమ్మెల్యేలు జడ్పీ హాలులోకి ప్రవేశించారు. ఎన్నికల పరిశీలకుడిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. సభ్యులను పోలీస్ బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించే హాలులోకి తీసుకువెళ్లారు.

ఎన్నిక వాయిదా వేయించడానికి టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.  తమకు నోటీసులు అందలేదని, ఎన్నిక వాయిదా వేయాలని టిడిపి నేతలు కోరారు. ఎన్నికని వాయిదా వేయమని  తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెప్పారు. తొలుత ఎన్నిక ఈరోజు జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది.

ఇదిలా ఉండగా, తమకు 23 మంది సభ్యులు ఉన్నారని, విజయం తమదేనని వైఎస్ఆర్ సిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement