Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌..

Published Fri, Oct 13 2017 5:30 PM

today news roundup

సాక్షి, హైదరాబాద్‌ : తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------

కంచ ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పు
 తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

‘నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’
ఏపీని ఆత్మహత్యల ప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు ధ్వజమెత్తారు.

నేతలతో చెట్టాపట్టాలు.. డ్యూటీలోనే ఇలా !
 దగదర్తి ఎస్సై శ్రీనివాస్‌ విజయ్‌ ఆగడాలు శృతిమించుతున్నాయి. టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఇతరులను వేధిస్తున్నారు. 

కర్నూలు జిల్లా విషాదంపై వైఎస్ జగన్‌ దిగ్ర్భాంతి
కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

------------------------------------------- జాతీయం --------------------------------------------

బెంగళూరులో జలకన్య.. వాహనదారుల విస్మయం
నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై..
శబరిమల ఆలయ కేసును రాజ్యంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

నన్ను కూడా రేప్‌ చేశాడు : నోరు విప్పిన మరో నటి
మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది.

ఓడ మునక.. భారతీయుల గల్లంతు
జపాన్‌ తీరంలో సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో పది మంది భారతీయులు కనిపించకుండాపోయారు.

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

స్నాప్‌డీల్‌ అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ ప్రారంభం
ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల కంటే ముందస్తుగానే స్నాప్‌డీల్‌ తన సేల్‌ను ప్రారంభించేసింది. 

అమ్మకానికి యమున ఎక్స్‌ప్రెస్‌వే
దేశంలోనే అతిపెద్ద రియల్‌-ఎస్టేట్‌ డెవలపర్‌ జేపీ, ఢిల్లీలోని తన ముఖ్యమైన హైవేని అమ్మేస్తుంది.

------------------------------------------- సినిమా --------------------------------------------

మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2'
రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, మూడో సినిమా కోసం మరోసారి హర్రర్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు.

అమ్మో సమంత కల్లోకి రావొద్దు...
అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని తొలి సినిమాతోనే మాయ చేసిన సమంత నిన్న మొన్నటి వరకూ చాలామంది డ్రీమ్‌గాళ్.

------------------------------------------- క్రీడలు --------------------------------------------

కట్నం కోసం భార్యను వేధిస్తున్న క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ కథ మళ్లీ మొదటికొచ్చింది.

ఖాన్‌ బాయ్‌.. హైదరాబాద్‌ మ్యాచ్‌కు రా..
బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను నేడు (శుక్రవారం) హైదరాబాద్‌ వేదికగా జరిగే భారత్‌-ఆస్ట్రేలియా అమీతుమీ టీ20 మ్యాచ్‌కు హాజరవ్వాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కోరారు. 

Advertisement
Advertisement