నేటి ముఖ్యవార్తలు.. | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యవార్తలు..

Published Mon, Aug 21 2017 10:05 AM

today news updates

ఉప ఎన్నిక ప్రచారం
♦ ఇవాళ్టితో నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ముగియనుంది.
♦ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం 13వ రోజుకు చేరుకుంది. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ నుంచి నేడు వైఎస్‌ జగన్ రోడ్‌ షో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్‌ జగన్‌ ప్రసంగంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం ముగియనుంది.
 
వెంకయ్య పర్యటన..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాజ్‌భవన్‌లో ఆయనకు పౌరసన్మానం నిర్వహించనుంది.
 
మోదీ భేటీ..
నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు.
 
సూర్యగ్రహణం..
భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9.30 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈ గ్రహణం హైదరాబాద్‌ వాసులకు ‍కనిపించే అవకాశం లేదు.
 
ఫ్లైఓవర్‌ శంకుస్థాపన..
తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు బాలానగర్‌ ప్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
 
క్రీడలు
♦ ఇవాళ ప్రోకబడ్డీ లీగ్‌కు విశ్రాంతి రోజు కావడంతో జూనియర్‌ కబడ్డీలీగ్‌ పోటీలు జరగనున్నాయి.
♦ నేటినుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభంకానుంది.
♦ పారిస్‌లో ఇవాళ్టి నుంచి రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభంకానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement