- లక్ష ఓట్లతో గెలుస్తామని టీడీపీ ధీమా
- గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు
- ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్
- 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఫలితం సోమవారం తేలనుంది. కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు. 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 1,47,153 మంది అంటే 49.92 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషులు 78,238 మంది, మహిళలు 68,915 మంది ఉన్నారు.
ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు.
కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు..
కౌంటింగ్కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ హర్షదీప్ కాంబ్లే కౌంటింగ్ను పర్యవేక్షించనున్నారు.
నేడే ఉప ఎన్నిక కౌంటింగ్
Published Mon, Feb 16 2015 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement