నేడు వైఎస్ జగన్ గుంటూరు రాక | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్ జగన్ గుంటూరు రాక

Published Thu, Apr 30 2015 11:50 PM

నేడు వైఎస్ జగన్ గుంటూరు రాక - Sakshi

సాక్షి, గుంటూరు :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు నగరానికి రానున్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవరాలు, పార్టీ నాయకుడు కిలారు రోశయ్య కుమార్తె సాయినివ్య వివాహ మహోత్సవానికి హాజరుకానున్నారు. జీటీ రోడ్డులోని సన్నిధి కల్యాణ మండపంలో ఉదయం 11.05 గంటలకు జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.

ఉదయం 9.45 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు చేరుకుంటారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. వివాహ కార్యక్రమానంతరం జగన్‌మోహన్‌రెడ్డి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, కార్మికులనుద్దేశించి మాట్లాడతారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement