నేడు, రేపు గ్రూప్‌–2 మెయిన్స్‌ | Sakshi
Sakshi News home page

నేడు, రేపు గ్రూప్‌–2 మెయిన్స్‌

Published Sat, Jul 15 2017 1:16 AM

Today, Tomorrow Group-2 mains

- 171 కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏపీపీఎస్సీ
1,000 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 982 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ పరీక్ష శని, ఆదివారాల్లో జరగనుంది.ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి శుక్రవారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలోని 13 జిల్లాలు, హైదరాబాద్‌లో మొత్తం కలిపి 171 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

49,106 మంది హాజరు కానున్నారు. కటాఫ్‌ ప్రకారం అర్హత మార్కులు వచ్చిన వారిలో 1,000 మందికి ఈ పరీక్ష రాసేందుకు అవకాశం దక్కడ లేదు. గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ లో 1:50 నిష్పత్తిలో కటాఫ్‌ నిర్ణయించి మెయిన్స్‌కు  ఎంపిక చేశారు.కటాఫ్‌లో అనేక మందికి సమాన మార్కులొచ్చాయి. వీరిలో వయసు ఎక్కువ ఉన్న వారికే అవకాశం కల్పించి తక్కిన వారిని ఏపీపీఎస్సీ  తిరస్కరించింది.  తమకూ పరీక్షకు అనుమతించాలని ఈ 1,000 మందీ మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

Advertisement
Advertisement