హోదాపై హీరోలు ఏమంటున్నారు? | Sakshi
Sakshi News home page

హోదాపై హీరోలు ఏమంటున్నారు?

Published Tue, Jan 24 2017 3:56 PM

tollywood heros support cause of ap special status, sundeep kishan to participate

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్న ఉద్యమం ఊపందుకుంటోంది. క్రమంగా ఒక్కో రంగానికి చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు కూడా 'మేము సైతం' అంటూ ఇందుకోసం ముందుకొస్తున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌తో పాటు మరో హీరో సందీప్ కిషన్ సైతం ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. 
 
సందీప్ అయితే తాను ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామిని అవుతానని చెప్పాడు. జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో జరిగే మౌన నిరసన ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానని, బాధ్యతాయుతమైన పౌరుడిగా రాష్ట్రానికి తనకు చేతనైనంత చేస్తానని చెప్పాడు. యువత అంతా తనతో కలిసి రావాలని కోరాడు. ఇక ఇప్పటికైనా మనమంతా ఒక్కటై రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, అది మన హక్కు, వాళ్లు హామీ ఇచ్చిన విషయమని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం ఏం చేసినా దానికి మద్దతిస్తానని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఏపీ ప్రత్యేక హోదాకు తన మద్దతు ఉంటుందన్నాడు. 
Advertisement
Advertisement