రేపు గవర్నర్ రోశయ్య రాక | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్ రోశయ్య రాక

Published Sun, Jun 8 2014 2:57 AM

రేపు గవర్నర్ రోశయ్య రాక - Sakshi

ఏలూరు, న్యూస్‌లైన్ : తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య సోమవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు అధికారులకు ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం రోశయ్య పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. జెడ్పీ అతిథి గృహం వద్ద గాడ్ ఆఫ్ హానర్ ఏర్పాటు, పోలీసు బందోబస్తును జిల్లా పోలీస్‌శాఖ నిర్వహిస్తుందని చెప్పారు.

గవర్నర్ భోజన ఏర్పాట్లను డీఎస్‌వో ఆధ్వర్యంలోను, వైద్యారోగ్యశాఖ అంబులె న్స్‌తో పాటు అత్యవసర ైవె ద్య సహాయాన్ని అందించే డాక్టర్ల బృందాన్ని, గవర్నర్ బ్లడ్ గ్రూప్ బి-పాజిటివ్ రక్తాన్ని  సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా ఏపీఈపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ సీఈవో డి.వెంకటరెడ్డి, డీటీసీ శ్రీదేవి, ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement