పాలకొండ రూరల్/సీతంపేట : సీతంపేట మండలం సరిహద్దుగూడ ప్రాంతంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొండ నుంచి ట్రాక్టర్తో ఇసుకను తీసుకువెళ్తుండగా సరిహద్దుగూడ గ్రామానికి సమీపించగానే ట్రాక్టర్ ఘాట్ రోడ్డు దిగుతుండగా అదుపు తప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఇసుక తొట్టెపై కూర్చున్న సవర తోటయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ బాపయ్య(32)ను శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. తోటయ్యకు భార్య అలివేలు, ఒక కుమార్తె ఉన్నారు. అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ బాపయ్య, సుగయ్యలను పాలకొండ ఏరియూ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. సుగయ్యను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
పోస్ట్మార్టానికి నిరాకరణ
చర్చి నిర్మాణానికి ఇసుక తీసుకువస్తుండగా మృతి చెందిన తోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎస్ఐ శ్రీనివాసరావు, సర్పంచ్ సారుుకుమార్, చర్చి పాస్టర్ వసంత్కుమార్ వారికి నచ్చజెప్పి ఒప్పించారు.
కూలికని వెళ్లి...
రోజూలాగే తోటయ్య, బాపయ్య కూలికని ట్రాక్టర్తో వెళ్లారు. సాయంత్రం వేళ ఇంటికి వస్తారని ఎదురు చూసిన వారి కుటుంబ సభ్యులకు వారి మృతి వార్త అందింది. తమ కుటుంబ పెద్దలు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. ఇక తమ దిక్కెవరూ అంటూ రోదించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు.
ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
పాలకొండ డివిజన్ పరిధిలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. కాసుల కక్కుర్తితో ఇసుక ట్రాక్టర్ల యాజమానులతో పాటు మరి కొంత మంది నాటు బళ్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విలువైన కలపతో పాటు ఇతర ముడి సరకులు వక్రమార్గాన పక్కదారి పడుతున్నాయి. వీటన్నింటిని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు సైతం ఇటువంటి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపకపోవటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని పలువురు సూచిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
Published Thu, Feb 11 2016 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement