డిజిటల్ కెమెరాలతో పోలీసుల హల్చల్
వాహనాలను ఫొటోలు తీస్తున్న వైనం
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గాలికి
వాహనచోదకులకు కొత్త కష్టాలు
‘ఏయ్ ఆటో ఆపు.. బండి నంబరెంత..! చేతిలో ఉన్న చిన్నపాటి యంత్రాన్ని (పీడీఎఫ్ డివైస్) టకటకా నొక్కి.. ఇదిగో 2013 నుంచి ఇప్పటివరకు నీ ఆటో ఇన్నిసార్లు నిబంధనలను అతిక్రమించింది. రెండు వేల రూపాయలు జరిమానా కట్టు’ .. ఇది ఓ పోలీస్ అధికారి హుకుం.
‘అదేంటి సార్.. నేనీ ఆటో కొనుక్కుని నాలుగు నెలలే అయింది.. 2013 నుంచి ఫైన్ కట్టమంటే ఎలా! ఈ నాలుగు నెలల్లో నేనెప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదు. ఒకవేళ మీరినా అప్పటికప్పుడే ఆపి జరిమానా రాస్తే కట్టేసేవాళ్లం కదా.. ఇదెక్కడి అన్యాయం సార్’ .. ఇది ఓ ఆటోడ్రైవర్ ఆవేదన.
భవానీపురం : ఇది ఒక్క ఆటోడ్రైవర్ వాదన, ఆవేదనే కాదు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు డిజిటల్ కెమెరాలతో చేస్తున్న హడావుడితో హడలెత్తిపోతున్న వాహనచోదకులందరిదీ. పోలీసులు ఎప్పుడు ఫొటో తీస్తున్నారో తెలియదు.. ఎందుకు తీస్తున్నారో తెలియదు. ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట ఉన్నట్లుండి వాహనాన్ని ఆపుతున్నారు. పోలీసు అధికారి చేతిలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే యంత్రం లాంటిది ఒకటుంటుంది. మీ వాహనం నంబర్ చెప్పండంటారు. చెప్పగానే టక టక కొట్టేసి.. ఇదిగో ఇన్నిసార్లు మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు.. ఇంత మొత్తం జరిమానా కట్టాలి.. అంటూ వాహనదారుడి చేతిలో చిన్న స్లిప్పు పెట్టేస్తున్నారు.
కనిపించని నాలుగో సింహం
నగరంలోని పోలీసుల తీరు చూస్తుంటే ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అనే సినీ డైలాగ్ గుర్తురాక మానదు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో పోలీసులు ఎవరికీ తెలియకుండా ఫొటోలు తీస్తుంటే.. కొన్ని కూడళ్లలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తమ చేతిలోని డిజిటల్ కెమెరాతో ఎవరికీ అనుమానం రాకుండా వాహనదారులను ఫొటోలు తీస్తున్నారు. ఆఫీసులు, ఆస్పత్రుల వంటి ముఖ్యమైన పనులకు వెళ్లే హడావుడిలో ఉండే ద్విచక్రవాహనదారులు, కిరాయి వేటలో ఉండే ఆటో డ్రైవర్లకు పోలీసులు ఫొటోలు తీసిన విషయమే తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు పంపిస్తున్న జరిమానా నోటీసులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఒక్కో కూడలిలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఎవరికి వారు ఫొటోలు తీసేస్తున్నారు. కొందరైతే డ్యూటీ వదిలేసి పక్క రోడ్లో పార్క్ చేసిన ద్విచక్రవాహనాల ఫొటోలను తీస్తున్నారు. ఎక్కడైనా రోడ్డుపై హఠాత్తుగా ఆటో ఆపితే అమాంతం ఫొటో తీస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇక వారు ఫొటోలపై పెట్టే శ్రద్ధ ట్రాఫిక్పై ఏం పెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాసులు కురిసేదెలా అంటే.. డిజిటల్ కెమెరాతో ఎన్ని ఫొటోలు తీసినా తొలగించే (డిలీట్ చేసే) వీలుంటుంది. ఇది పోలీసులకు కాసులు కురిపిస్తోంది. ఏదేనీ వాహనాన్ని ఫొటో తీయడం ఆ వ్యక్తి గమనిస్తే జరిమానా కట్టేందుకు మక్కువచూపడం లేదు. ఎంతో కొంత సొమ్ము సదరు కానిస్టేబుల్కో, హోంగార్డుకో ముట్టజెప్పి ఫొటోను తొలగింపజేసుకుంటున్నారు.
సూచికలు లేకుండా జరిమానాలా.. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సూచికలు పలుచోట్ల కనిపించడం లేదు. అలాంటప్పుడు జరిమానా ఎలా విధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల వన్వే, నో పార్కింగ్, బస్స్టాప్ వంటి సూచిక బోర్డులు లేవు. మరికొన్ని జంక్షన్లలో జీబ్రాలైన్లు వెలిసిపోయి కనిపించడం లేదు. అయినా పోలీసులు ఫొటోలు తీసేస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.
బొమ్మ పడిందా.. కేసులూ కాసులే!
Published Fri, Mar 6 2015 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement