విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడి కుమార్తె మృతి
ఆ ఘటనను చూసి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలిడిచిన తల్లి
గృహ ప్రవేశం జరగాల్సిన ఇంట్లో తల్లీకుమార్తె మృతదేహాలు
కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీలో ఘటన..
అల్లూరు (కొత్తపట్నం) : విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన కుమార్తె చనిపోవడంతో ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అల్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి జరగగా గురువారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన కుంచాల సరోజనమ్మ (65)కు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కంకణాల తిరుమల (36)తో పాటు మరో కుమార్తె ఉంది. శ్రీనివాసరావు ఒంగోలులో కానిస్టేబుల్. ఇటీవల స్వగ్రామంలో ఇల్లు కట్టించుకున్నాడు. ఆ ఇంట్లో శనివారం చేరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త ఇంట్లో సరోజనమ్మ, ఆమె కుమార్తె తిరుమల ఉన్నారు. నీటి కోసం తిరుమల మోటార్ వేయగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంచెం దూరంలో ఉండి గమనించిన తల్లి సరోజనమ్మ బిగ్గరగా కేకలేస్తూ కుమార్తె వద్దకు వస్తుండగా తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది. తిరుమల మృతదేహాన్ని ఆమె మెట్టినిల్లు పేర్నమిట్ట తరలించారు.
బంధువులను ఆహ్వానించేందుకు శ్రీనివాసరావు ఒంగోలు వెళ్లారు. రాత్రి 8.30 గంటల సమయంలో పంచాయతీ నీరు రావడం లేదని కుమారుడు శ్రీనివాసరావుకు తల్లి సరోజనమ్మ ఫోన్ చేసింది. మోటార్ బాగాలేదని, దాని జోలికి వెళ్లొద్దని తల్లితో శ్రీనివాసరావు ఫోన్లో చెప్పాడు. ఏదో ఒక రకంగా మోటార్తో ట్యాంకులో నీరు నింపుకోవాలన్న ఉద్దేశంతో తిరుమల వైరు తీసి ప్లగ్లో పెట్టి స్వీచ్ వేసింది. ఇంతలో విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలేసి ప్రాణాలు కోల్పోయింది.
భర్త మృతితో పుట్టింటికి వచ్చి..
తిరుమలకు పేర్నమిట్ట గ్రామానికి చెందిన కంకణాల యల్లమందయ్యతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అతను పెయింట్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వారికి శాంతి, సాయి అనే ఇద్దరు పిల్లలున్నారు. 5 ఏళ్ల క్రితం యల్లమందయ్య గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సరోజనమ్మ వద్దకు వచ్చి పిల్లలతో కలిసి అక్కడే ఉంటోంది. కుమార్తె శాంతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. కుమారుడు కరెంట్ పనికి వెళ్తూ ఉంటాడు.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి దూరం కావడంతో పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. అల్లూరులో ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరు మృతి చెందటం ఇదే మొదటి సారి..అని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై బి.ఫణిభూషణ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామస్తులు, మృతుల బంధువులతో మాట్లాడారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
అల్లూరులో విషాదం
Published Fri, Jul 31 2015 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement