నిజామాబాద్ నాగారం, న్యూస్లైన్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్వైర్ను అమ్ముకోగా వచ్చిన డబ్బులను, కాంట్రాక్టులు అధికారులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యూనియన్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అవీనీతిపై ట్రాన్స్కో సీఎండీ కార్తికేయమిశ్రా సీరియస్గా తీసుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఏడీ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కావాలని ట్రాన్కో ఎస్ఈ నగేశ్కుమార్కు ఆదేశించారు.
ఏం జరిగిందంటే
కొద్ది నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం జిల్లా స్టోర్ నుంచి రూ. 20 లక్షల విలువ చే సే కాపర్ వైరును విడుదల చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే రూ. 20 లక్షల విలువ చేసే మెటీరియల్ ఇచ్చిన సదరు అధికారులు.. దానిని కాంట్రాక్టరే కొనుగోలు చేశారని రికార్డుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ. 20 లక్షల బిల్లును కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే రూ. 20 లక్షల వైరుతోపాటు, 20 లక్షల రూపాయలనూ కాంట్రాక్టర్కు దోచిపెట్టారన్నమాట. అధికారులు ఇలా ‘అదనపు సంపాదన’ కోసమే చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు.
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు అనంతరం కాలిపోయిన కాపర్వైరును స్టోర్లో జమచేయా ల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాతదాని బదులు కొత్త వైరు ఇస్తారు. స్టాక్ లేకపోతే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఏడాదిగా పాత వైరును స్టోర్లో జమ చేయడం లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 20 లక్షల విలువ చేసే పాత వైరుకు లెక్కలు చూపలేదని సమాచారం. కాపర్ వైరుకు డిమాండ్ ఉండడంతో మరమ్మతు కేంద్రాల్లోని అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాత వైరును అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
రికార్డులు మాయం
అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు రికార్డులను సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరైతే రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఏడీ నాగరాజు.. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు సంబంధించిన రికార్డులను ఏడాది కాలంగా నిర్వహించడం లేదు. తన సెక్షన్కు సంబంధించి స్టాక్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశామన్న వివరాలను ఆయన రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొన్న సదరు ఏడీ.. కాంట్రాక్టర్లతో దోస్తీ కట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఏడీ కార్యాలయానికి వచ్చిన డీఈ.. ట్రాన్స్ఫార్మర్ల సంబంధించిన రికార్డ్స్ చూపించాలని అడగ్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లను అమ్ముకున్నారని, అందుకే రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఉన్న రిజిస్టర్లను సైతం మాయం చేశారని తెలుస్తోంది.
నాలుగు రోజుల్లో విచారణ పూర్తి
-నగేశ్, ఎస్ఈ, ట్రాన్స్కో, నిజామాబాద్
ట్రాన్స్కోలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులను విచారణ అధికారులుగా నియమించాం. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి, సీఎండీకి నివేదిక పంపిస్తాం. ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది విచారణ నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది.
ఇంటి దొంగలు
Published Sat, Jan 25 2014 6:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement