సాక్షి ప్రతినిధి, నెల్లూరు/దర్గామిట్ట: ఇప్పటిదాకా డబ్బులు సంపాదించేందుకు కొందరు వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. వారిని రియల్టర్లుగా పిలుస్తున్నాం. తాజాగా వ్యాపారుల స్థానంలో అధికారులే రియల్టర్ల అవతారం ఎత్తుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన కొందరు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసుకుని.. అందులో ప్లాట్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. అందులో రవాణాశాఖ అధికారులు కూడా ఉన్నారు.
పనిలో పనిగా తమ శాఖ కార్యాలయాన్ని కూడా ఆ ప్లాట్ల వద్దకే మార్చుకుని వాటి విక్రయానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే గూడూరు శివారు ప్రాంతంలో ఆదివారం ప్రారంభం కానున్న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే గూడూరు సమీపంలోని పురిటిపాళేనికి వెళ్లాల్సిందే.
గూడూరు పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నుంచి పోటుపాళెం పంచాయతీ పరిధిలోని పురిటిపాళెం వెళ్లే మార్గంలో కొందరు రవాణాశాఖ అధికారులు కలిసి ‘అప్ టౌన్ వింటేజ్’ వెంచర్ ఏర్పాటు చేశారు. 2011 నవంబర్లో కొండయ్య బాలసుబ్రమణ్యం, గోగినేని సురేష్బాబు, అన్నవరపు కాశీవిశ్వనాథం, సిల్వర్ సౌండ్స్ షెల్టర్ ప్రైవేట్ లిమెటెడ్ పేరుతో సర్వే నంబర్ 1052 నుంచి 1066 వరకు ఉన్న 28.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వెంచర్ల కోసం కన్వర్షన్ చేశారు. అందులో ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు.
అయితే ఆ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం ఈ భూమిని వ్యవసాయ భూమి కింద వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వర్షన్గా మార్చిన భూమిని వ్యవసాయ భూమిగా మార్చేందుకు వీల్లేదు. అయితే అధికార పలుకుబడితో విశాఖపట్నంలో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిగా మారాలంటే వ్యక్తి పేరుమీద పాసుపుస్తకం, టైటిల్డీడ్, అండంగల్ ఉంటేనే వీలవుతుంది. అయితే ఇవేమీ లేకుండానే వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ప్రభుత్వ భూమినికలిపేసుకున్న ఘనులు
పురిటిపాళెం వెళ్లేమార్గంలో వేసిన అప్టౌన్ వింటేజ్ వెంచర్లో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధ్రువీకరించటానికి భయపడుతున్నారు. అందులో ఎకరం ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా అందులో ఐదెకరాలకుపైనే ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ జరిపితే అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంద ని అధికారుల అభిప్రాయం.
బినామీల పేరుతో కొనుగోలు
అప్టౌన్ వెంచర్ను రవాణాశాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు కలిసి బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. రవాణా కార్యాలయంలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ఏజెంట్లే బినామీలుగా పెట్టుకున్నట్లు తెలిసింది. ప్లాట్లు దిగువ ప్రాంతంలో ఉండటం.. గూడురు పట్టణానికి దూరంగా ఉంటం.. వర్షం వస్తే ముంపునకు గురవుతుందనే భావనతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు ఎలాగైనా ప్లాట్లను అధిక ధరలకు విక్రయించేందుకు పథకం వేశారు.
జన సంచారమే లేని చోటుకు ప్రాంతీయ కార్యాలయం
జన సంచారమే లేని ప్రాంతానికి రవాణా ప్రాంతీయ కార్యాలయాన్ని మార్చారు. ఆ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. పట్టణం ఎక్కడా భవనాలే దొరకనట్టు..గూడూరుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు వ్యక్తి కట్టించిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవన యజమాని కూడా వెంచర్లో ఒక భాగస్తుడని తెలిసింది.
కొత్త కార్యాలయానికి చేరుకోవాలంటే జాతీయ రహదారి నుంచి కి లోమీటరుకు పైగా లోనికి వెళ్లాలి. అప్టౌన్ వింటేజ్లో ప్రవేశించాక చిట్టచివర రవాణా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
కార్యాలయం చివర్లో ఉంటే.. వచ్చే వారంతా ముందున్న ప్లాట్లను చూసుకుంటూ వస్తారు. వందలో కనీసం పది మందైనా ప్లాట్లను కొనుగోలు చేయకపోతారా? అనే భావనతో అధికారులు పథకం ప్రకారమేచివర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.
రవాణా ‘రియల్' ఎత్తు
Published Mon, Nov 3 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement