ఆరోపణలు రుజువు చేసేందుకు విచారణ జరిపించండి | Sakshi
Sakshi News home page

ఆరోపణలు రుజువు చేసేందుకు విచారణ జరిపించండి

Published Thu, Oct 9 2014 1:44 AM

ఆరోపణలు రుజువు చేసేందుకు  విచారణ జరిపించండి - Sakshi

సీఎం బాబుకు రఘువీరారెడ్డి లేఖ

హైదరాబాద్: రాజకీయంగా తనపై చేస్తున్న ఆరోపణలన్నింటిమీదా విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా మేఘమథనం కార్యక్రమా న్ని నిర్వహించినా అక్రమాలు జరిగాయంటూ పదేపదే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదు చేసి భంగపడి మొట్టికాయలు తిన్నప్పటికీ మీ వైఖరిలో ఇప్పటికీ మార్పు రాలేదని తప్పుపట్టారు. సీఎంగా మీ వ్యాఖ్యలకు విలువ ఉంటుంది కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని చంద్రబాబుకు సూచించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణకు ఆదేశించి నిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement