వేంపల్లె : రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు అటానమస్ (స్వయంప్రతిపత్తి) కల్పించినట్లు చాన్సలర్ అడ్వయిజర్ వై.కృష్ణారెడ్డి తెలిపారు. మూడు ట్రిపుల్ ఐటీలను సమానంగా అభివృద్ధిపరచాలన్నదే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్ట్ 16వ తేదీనుంచే ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలోని నూజివీడు, కడప జిల్లాలోని ఇడుపులపాయ, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలు ఆర్జీయూకేటీ పరిధిలో ఉండేవన్నారు.
ఆగస్ట్ 4వ తేదీన హైదరాబాద్లోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రాజ్కుమార్, రిజిష్ట్రార్ సోమయ్య నేతృత్వంలో సమావేశం జరిగిందన్నారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆగస్ట్ 16వ తేదీనుంచి ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. గతంలో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా యూనివర్శిటీ అనుమతి తీసుకుని అక్కడ బిల్లు పాసైన తర్వాతనే మొత్తం వచ్చేదన్నారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదన్నారు. పర్యవేక్షణ యూనివర్శిటీ పరిధిలో ఉన్నప్పటికి ఆయా ట్రిపుల్ ఐటీలే స్వయంగా నడుస్తాయన్నారు. ఇందుకు సంబంధించి మూడు కమిటీలు ఉంటాయన్నారు. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్, ఫైనాన్షియల్ అటానమీలు ఉంటాయన్నారు. ఇందుకోసం అధికారులను కూడా నియమించారన్నారు. ఇన్ఛార్జి డెరైక్టర్గా వేణుగోపాల్రెడ్డి, ఫైనాన్షియల్ ఆఫీసర్గా కె.ఎల్.ఎన్.రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విశ్వనాథరెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా ప్రభాకర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కో.ఆర్డినేటర్గా డి.వి.రావులను నియమించినట్లు తెలిపారు. మొదటి స్నాతకోత్సవంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 13బంగారు పతకాలు రాగా నూజివీడుకు ఒకటి వచ్చిందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి ఒక్క బంగారు పతకం కూడా రాలేదన్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వం నుంచే కాకుండా వారు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడంవల్లే కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ఇడుపులపాయలో నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే హైదరాబాద్లో కాన్వకేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు.
ట్రిపుల్ ఐటీలకు అటానమస్
Published Tue, Sep 2 2014 1:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement