మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్లైన్ : వేగంగా వస్తున్న లారీ.. ఆటోను ఢీకొని చెరువులో బోల్తాపడటంతో పది మంది అక్కడికక్కడే జల సమాధికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియరాలేదు. ఈ సంఘటన పెద్దారవీడు మండలం గొబ్బూరు చెరువు వద్ద శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. రాత్రి 11గంటల సమయానికి ఏడు మృతదేహాలను పోలీసులు అత్యంత కష్టం మీద బయటకు తీశారు. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ లోడుతో లారీ కంభం వైపు వెళ్తోంది.
దాచేపల్లి వద్ద మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది కూలీలు తమ స్వగ్రామం వెళ్లేందుకు లారీపైకి ఎక్కారు. యర్రగొండపాలెంలో పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన ముగ్గురు మిర్చి నారుతో లారీ ఎక్కారు. లారీ గొబ్బూరు వద్దకు రాగానే ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆటోను ఢీకొని ఆ పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా కొట్టింది. రోడ్డున వెళ్లే ప్రయాణికులు గొబ్బూరు గ్రామస్తులు, పెద్దారవీడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాత్రి 11గంటల సమయానికి 3జేసీబీల సహాయంతో లారీని పైకి లేపి చెరువులో ఉన్న కలనూతల గ్రామానికి చెందిన శీలం శ్రీనివాసరెడ్డి(60), చింతగుంట్ల గ్రామానికి చెందిన ఎనిబెర చెన్నయ్య (45), బరిగెల రాజయ్య (4), ఎనిబెర మరియమ్మ (35), బరిగెల నడిపయ్య (45), ఎనిబెర ధర్మయ్య (6), పెద్దారవీడుకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి (50), పాండు రంగారెడ్డి(45)ల మృతదేహాలను బయటకు తీశారు. చింతగుంట్ల గ్రామానికి చెందిన రాయల శారమ్మ, దయామణిలు కొన ఊపిరితో ఉండగా హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐలు ఎ.శివరామకృష్ణారెడ్డి, పాపారావు, ఎస్సైలు దాసరి ప్రసాద్, ఎ.రాజమోహనరావు, త్రిపురాంతకం ఎస్సై శ్రీనివాసరావు, స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు అధికంగా ఉండటంతో మృతదేహాల వెలికితీతకు ఆలస్యమైంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన ఆటో డ్రైవర్ను వైద్యశాలకు తరలించారు.
10మంది జలసమాధి?
Published Sun, Oct 27 2013 6:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement