కాలి నడకన తిరుమలకు టీటీడీ ఈవో | Sakshi
Sakshi News home page

కాలినడకన తిరుమలకు టీటీడీ నూతన ఈవో

Published Fri, May 5 2017 7:13 PM

కాలి నడకన తిరుమలకు టీటీడీ ఈవో - Sakshi

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా  నియమితులైన ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌  శుక్రవారం కాలినడకన తిరుమల చేరుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ఆయన తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నారు. అలాగే నడకదారి భక్తుల క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.  ప్రస్తుత ఈవో సాంబశివరావు నుంచి శనివారం ఉదయం సింఘాల్‌ టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.

కాగా తితిదే ఈవోగా సాంబశివరావు పదవీకాలం ముగియడంతో ఆయనను ప్రభుత్వం.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చరిత్రలో ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు టీటీడీ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

Advertisement
Advertisement