రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

Published Mon, Dec 28 2015 5:08 PM

Two die in Road accident

లింగాల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా లింగాల మండలం గునకనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిత్తూరు జిల్లా సీలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గునకల గ్రామానికి చెందిన గంగయ్య(50), రంగయ్య(32)లు తమ టాటా ఏస్ వాహనంలో అరటి కాయల లోడుతో చిత్తూరు వెళ్తుండగా.. సీలేరు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటాఏస్‌లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement