Sakshi News home page

రోడ్డు ప్రవూదంలో ఇద్దరి మృతి

Published Sun, Aug 18 2013 3:14 AM

two killed in road accident

 డీ.హీరేహాళ్, న్యూస్‌లైన్: వుండలంలోని వసగుడ్డం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రవూదంలో ఆ గ్రావూనికి చెందిన సిద్దప్ప(65), నీలవ్ము(35) మృతి చెందారు. గ్రావుస్తులు, పోలీసుల కథనం మేరకు..బళ్ళారి వైపు నుంచి రాయుదుర్గానికి వేగంగా వెళుతున్న బొలేరో వాహనం ఉదయుం 6.30 గంటల సవుయుంలో వసగుడ్డం వద్ద రోడ్డు పక్కన వెళుతున్న కురుబ సిద్దప్పను ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వేగంతో పాల కోసం వెళుతున్న నీలవ్మును ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయుపడింది.
 
 అప్పటికీ బొలేరో వాహనం వేగం తగ్గక పోవడంతో అదుపు తప్పి కొద్ది దూరంలో ఉన్న విద్యుత్ స్తంభం పక్కన బోల్తా పడింది. వాహనంలో ప్రయూణిస్తున్న ముగ్గురు వ్యక్తులు క్షేవుంగా బయట పడ్డారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన నీలమ్మను గ్రామస్తులు హుటాహుటిన ఆటోలో బళ్ళారికి తరలిస్తుండగా వూర్గవుధ్యంలో మరణించింది. ఒకేసారి ఇద్దరు  మృతి చెందడంతో గ్రావుంలో విషాదం అలుముకుంది. కాగా డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించావుని గ్రామస్తులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ శివశంకర్ తెలిపారు. 
 

Advertisement
Advertisement
Advertisement