వైఎస్ఆర్ జిల్లాలో పండగపూట విషాదం | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ జిల్లాలో పండగపూట విషాదం

Published Wed, Jan 14 2015 9:25 AM

two killed in ysr district road accident

దువ్వురు: వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు  మండల పరిధిలోని ఏకోపల్లె వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకోపల్లికి చెందిన కూలీలు రాజపాళెం మండలం కొత్తపల్లెకు ఆటోలో వెళుతుండగా వెనుక వైపు నుంచి ఓ లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఏలీసమ్మ (35) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని 108 సహాయంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీటెక్ చదువుతున్న ఓ యువకుడు  మృతి చెందాడు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పండుగ రోజు ఇద్దరు మృతి చెందటంతో ఏకోపల్లిలో విషాదం నెలకొంది.

Advertisement
Advertisement