రాజధానిపై సర్కారు కసరత్తు
ప్రభుత్వం, రైతులకు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయడం మొదటి పద్ధతి
అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం రైతులకివ్వాలన్నది రెండో పద్ధతి
6వ తేదీన విధివిధానాల ఖరారు..
విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పద్ధతులను అనుసరించాలని భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే, రైతులకు ఎంతమేరకు భూమి ఇవ్వాలన్న విషయంపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం, రైతుల మధ్య పరస్పర ప్రయోజనం కలిగేలా రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్లో సేకరించించే భూముల్లో ప్రభుత్వం, రైతులు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది ఒక ప్రతిపాదన. అభివృద్ధి చేసిన భూముల్లో 20 శాతం రైతులకు ఇవ్వడం రెండో పద్ధతి. ఈ రెండింటిలో దేనిని అనుసరించాలన్న విషయంపై కసరత్తు జరుగుతోంది. అలాగే భూములిచ్చే రైతులు దాదాపు మూడేళ్లపాటు ఎటువంటి ఆదాయం లేకుండా పంటను నష్టపోయే అవకాశం ఉన్నందున అర్హత కలిగిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున చెల్లించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా 6న జరిగే సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆరోజునే విధివిధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం.
మొదటి దశ మంగళగిరి నుంచే..
రాజధానికి అవసరమైన భూమిని 4 దశల్లో సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ ఫూలింగ్ విధివిధానాలు ఖరారై, రైతులు ఇందుకు ఆమోదం తెలిపితే తొలి దశలో మంగళగిరి నుంచే భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళగిరి అయితే అన్నింటికీ మంగళకరమన్న పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరి, ఉండవల్లి, తాడేపల్లి, తుళ్లూరు, అమరావతి మండలాల్లోని కొన్ని ప్రాంతాల భూములను తొలి దశలో సేకరించే అవకాశముందని సమాచారం.
మళ్లీ భూముల ధరలకు రెక్కలు.
వీజీటీఎం పరిధిలోనే నూతన రాజధాని నగరం ఉంటుందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన గుంటూరు, తెనాలి ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయుక్తంగా మారింది. నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా నూజివీడు, ఇబ్రహీంపట్నం, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, గన్నవరం వైపు పరుగులు తీసిన జనం ఆదివారం నుంచి తెనాలి, గుంటూరు వైపు చూస్తుండటంతో మళ్లీ రియల్ వ్యాపారానికి ఊపొచ్చినట్లయ్యింది.
రెండు పద్ధతుల్లో రైతులకు భూ పంపిణీ!
Published Mon, Sep 29 2014 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement