గొడవలతో కాల్చుకున్నారు | Sakshi
Sakshi News home page

గొడవలతో కాల్చుకున్నారు

Published Tue, May 12 2015 9:10 PM

two police constables died

కర్నూలు: కర్నూలు జిల్లాలోని కొత్తపేటలోని పోలీసు నివాసగృహంలో నివాసముంటున్న ఏఆర్ కానిస్టేబుల్ మురళికృష్ణ(25), సివిల్ కానిస్టేబుల్ వీరేశ్(25)లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు గత కొంతకాలంగా ఒకే గదిలో ఉంటున్నారు. మురళికృష్ణ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుండగా.

వీరేశ్ కృష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వారిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి డీఐజీ రమణ కుమార్ స్పందిస్తూ ఘటనకు వారిద్దరి మధ్య గొడవలే కారణమని చెప్పారు. అందుకే ఒకరిని ఒకరు కాల్చుకున్నారని చెప్పారు. ముందు మురళీ కృష్ణను వీరేశ్ కాల్చాడని, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని తెలిపారు.

Advertisement
Advertisement