సాక్షి, హైదరాబాద్: వివాదాలు పడుతూ ఉంటే సమయం వృథా అని ఇరు రాష్ట్రాలూ నష్టపోతాయని, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుతో భేటీలో స్పష్టం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం రాజ్భవన్లో కేసీఆర్తో చర్చల అనంతరం.. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధత లేకుండా జరిగిందని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఉంటే ఈ సమస్యలుండేవి కావని కేసీఆర్ కూడా అభిప్రాయపడ్డారన్నారు. ‘‘సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల విభజన అంశం చర్చించాం. సీఎస్లు దీన్ని పరిష్కరిస్తారు. సమస్యలేమైనా ఉంటే సీఎంలు ఇద్దరం మళ్లీ మాట్లాడతాం. కేంద్ర సర్వీసు అధికారుల విభజన ఈ నెల 22, 23 తేదీల నాటికి కొలిక్కి వస్తుంది’’ అని బాబు చెప్పారు. హైదరాబాద్ అంశం కేంద్రం సెక్షన్ 8లో పెట్టినా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతోందన్నారు. ఇతర దేశాలనుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలంటే బందరు పోర్టు సేవలు అవసరమవుతాయని కేసీఆర్ ప్రస్తావించారన్నారు. ఏపీ రాజధాని గురించి కేసీఆర్ అడిగారని, తెలుగు వ్యక్తిగా, సీఎంగా, సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినందున అడగడంలో తప్పులేదన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ స్కీము ఉంచాలో దేన్ని తీసేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఫీజు రీయంబర్స్మెంట్కు సంబంధించి కొత్త పథకాన్ని పెడుతున్నామని కేసీఆర్ చెప్పారే తప్ప ఫలానా వారికి ఇవ్వబోమనడం లేదు. అక్కడ పన్నులు చెల్లించే వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. స్థానికతకు 1956 కటాఫ్ అంటే అమలుకు వీలుకాదు. ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అది వారి సొంత ప్రాంతమని నిబంధనలు చెబుతున్నాయి’’ అని బాబు వ్యాఖ్యానించారు.
సర్వేలో ఇబ్బందులుంటే.. అక్కడి టీడీపీ చూస్తుంది: రాజకీయ పార్టీగా సర్వేలోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఇబ్బందులుంటే విభేదిస్తామని, తెలంగాణలోనూ టీడీపీ ఉంది కనుక అక్కడి పార్టీ నేతలు దాన్ని చూస్తారన్నారు. టీసీఎస్గా ఉన్న రాజీవ్శర్మ ఉత్తరాదికి చెందిన వారని, ఆయన లాటరీలో ఏపీకి వస్తే.. తెలంగాణకు ఇస్తామని ఎన్ఓసీ ఇవ్వండని కేసీఆర్ నవ్వుతూ అడిగారని బాబు చెప్పారు. ‘‘తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కావాలి కనుక ఏపీ సమావేశాలు ముందుగా ముగించాలని కేసీఆర్ అడిగారు. సమావేశంలోనే ఏపీ స్పీకర్ కూడా ఉన్నందున ఆ మేరకు నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తామన్నారు’’ అని చెప్పారు.
వివాదాలతో ఇరువురికీ నష్టం: బాబు
Published Mon, Aug 18 2014 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement