భద్రాచలం, న్యూస్లైన్: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ ముఠాను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.70లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం భద్రాచలం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ప్రకాష్రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. భద్రాచలం ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తుం డగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొన్ని వాహనాలు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు వినియోగిస్తున్న వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తొలుత తాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దొంగల ముఠా వివరాలు తెలిశాయి.
భద్రాచలం మండలంలోని పాలమడుగు గ్రామానికి చెందిన తాటి నాగేశ్వరరావు బోర్వెల్ పనుల కోసం నల్లగొండ జిల్లాకు వెళ్లగా నల్లగొండకు చెందిన రాచూరి సతీష్, అదే జిల్లా మిర్యాలగూడేనికి చెందిన కారు డ్రైవర్ తీగల శ్రీకర్రావుతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి ఏడాది కాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నారు. సతీష్ డూప్లికేట్ తాళలు తయారు చేయగా వారు ద్విచక్ర వాహనాలు చోరీ చేసి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇలా వీరు భద్రాచలం, మణుగూరు, ఎల్బీనగర్, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. ఎల్బీ నగర్, మిర్యాలగూడ వాహనాలను భద్రాచలం ప్రాంతంలో, ఇక్కడి వాహనాలను మిర్యాలగూడెంలో విక్రయించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక దృష్టి సారించిన ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సహకరించిన ఏఎస్సై లక్ష్మణ్, ఐడీ పార్టీ సిబ్బంది డానియేల్, సూర్యం, కామేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనులకు తగిన ప్రోత్సాహకం అం దించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస రెడ్డి, భోజరాజు, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై రామారావు ఉన్నారు.
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
Published Wed, Jan 1 2014 5:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement