హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను వేలెత్తి చూపడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... చంద్రబాబు ఏడాది పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏడాది పాలన మోసాలపుట్ట, వంచనల చిట్టా చరిత్రలో మిగిలిపోతుందన్నారు.
ఎన్నికల ముందు వందల కొద్దీ వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధాని భూ సేకరణ, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వం కళ్లు తెరిపించి ప్రజలకు న్యాయం చేసేందుకే వైఎస్ జగన్ ఈ దీక్ష చేస్తున్నారని వివరించారు.