సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు దినదినగండంలా ఉంది. ఒక్కోరోజు గడుస్తుంటే వేలాది మంది ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయించకపోవడమే. ఏటా ఉద్యోగ నియామకాలంటూ చెప్పి ఈ నాలుగున్నరేళ్లలో 2016లో మాత్రమే 4,275 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా అవి వెలువడడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ ఏడాది సెప్టెంబర్ 19న 18,450 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆ వయో పరిమితిని మించిపోయిన వేలాది మంది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కనీసం దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పుట్టిన తేదీ, గరిష్ట వయోపరిమితిపై లెక్కలు వేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకోవలసిన దుస్థితిలోకి ప్రభుత్వం తమను నెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఒక్కో ఏడాదికి పరిమితి పెంపు..
గరిష్ట వయోపరిమితిని 2014లో 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తరువాత దాన్ని 42 ఏళ్లకు పెంచింది. ఈ గరిష్ట వయోపరిమితి పెంపును కేవలం ఒక్కో ఏడాదికి మాత్రమే పరిమితం చేస్తూ ఏటా ఉత్తర్వులు ఇస్తోంది. 2016లో 42 ఏళ్లకు పెంచిన సమయానికే వేలాది మంది వయోపరిమితి మించిపోయి అవకాశం కోల్పోయారు. ఆతరువాత నుంచి నోటిఫికేషన్లు లేక మరిన్ని వేలమంది వయోపరిమితి గండంలో చిక్కుకున్నారు. పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు పెంచడమే కాకుండా దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఫలితంగా అక్కడి నిరుద్యోగులకు కనీసం దరఖాస్తు చేసుకొనేందుకైనా అవకాశం దక్కుతోంది. ఏపీలో మాత్రం 42 ఏళ్లకే పరిమితం చేయడం.. మూడేళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు.
డీఎస్సీ, యూనిఫాం పోస్టులకు రెండేళ్లు పెంచి..
ప్రభుత్వం ఆమోదించిన 18,450 పోస్టుల్లో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులకు, ఎస్ఐ తదితర యూనిఫాం పోస్టులకు పెంచిన గరిష్ట వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్లు పెంచారు. దీని ప్రకారం డీఎస్సీ పోస్టులకు 44 ఏళ్లు, యూనిఫాం పోస్టులకు ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితికి అదనంగా రెండేళ్లు అవకాశం కల్పించారు. అయితే ఏపీపీఎస్సీ పరిధిలో భర్తీచేయాల్సిన పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు కనుక గరిష్ట వయోపరిమితిని కనీసం మరో రెండేళ్లు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతమున్న వయోపరిమితి ప్రకారమే అయితే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడానికీ అవకాశం కోల్పోతామని నిరుద్యోగులు చెబుతున్నారు.
పోస్టులకు ఆమోదం తెలిపి నెలలు గడిచినా..
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి మంత్రివర్గంలో ఆమోదం తెలిపామని నాలుగు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఆతరువాత దానిపై జీవో ఇవ్వడానికి నెలన్నర సమయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్లను మాత్రం ప్రభుత్వం విడుదల చేయించడం లేదు. ఈ పోస్టుల్లో గ్రూప్1–182, గ్రూప్2–337, గ్రూప్3–1,670, హోంశాఖ 3,000, మెడికల్ 1,604, లెక్చరర్లు 725, ఇతర పోస్టులు 1,657, టీచింగ్ 9,275, మొత్తం 18,450 పోస్టులను ప్రకటించి డీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంటు బోర్డు వరకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. కీలకమైన ఏపీపీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు.
నిరుద్యోగులకు ‘వయో’ గండం
Published Mon, Nov 19 2018 4:04 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
రెండ్రోజులు మోస్తరు వానలు!
రెండ్రోజులు మోస్తరు వానలు!
Lok Sabha Election 2024: నికమ్ వర్సెస్ వర్షా
తొమ్మిది మోడల్ పోలింగ్ కేంద్రాలు
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దాం
‘ఉచిత కానుకలపై గట్టి నిఘా ఉంచాలి’
జిల్లా జైలు తనిఖీ
ప్రత్యర్థుల విమర్శలు అర్థరహితం..
వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..
తప్పక చదవండి
- నన్ను నమ్మండీ! నేను ఇది వరకులా కాను!!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement