వివక్ష చూపి విధుల నుంచి తొలగించారన్నా... | Sakshi
Sakshi News home page

వివక్ష చూపి విధుల నుంచి తొలగించారన్నా...

Published Mon, Aug 13 2018 8:19 AM

Unemployeed Yoth Shown Pla Cards In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :‘మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకం చేపట్టారు. తమలాంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించిన ఘనత పెద్దాయనకే దక్కుతుంది. నెలకు  రూ.1200 గౌరవ వేతనాన్ని అమలు చేశారు. పదేళ్లపాటు సేవలందించిన తమను అధికార పార్టీకి చెందిన వారు వివక్ష చూపించి విధుల నుంచి తొలగించారని’ తుని నియోజకవర్గంలోని తుని, కోట నందూరు, తొండంగి మండలాలకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు నాగులాపల్లి జోగిరాజు, గాడి శ్రీను, వి.వీరాస్వామి, డి.బ్రహ్మారావు, బి.దుర్గాప్రసాద్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో జగన్‌ను కలిసి తొలగింపునకు గురైన 32 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లకు న్యాయం చేసేలా చూడాలని కోరారు. తొలగించడంపై కోర్టును ఆశ్రయించామని, తమను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించినా పాలకులు, సంబంధిత అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement